యూఏఈలో జనవరి నుండి ప్రీ-మాజెనెటిక్ పరీక్షలు తప్పనిసరి..!!
- December 26, 2024
యూఏఈ: జనవరి 2025 నుండి యూఏఈ అంతటా వివాహం చేసుకోవాలనుకునే పౌరులందరికీ జన్యు పరీక్షలు చేయించుకోవాలి. వివాహానికి ముందు స్క్రీనింగ్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రామాణికమైన వైద్య పరీక్షల్లో భాగంగా జన్యు పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. వివాహానికి ముందు జంటలు, పౌరులు, ప్రవాసులు ఇద్దరికీ వివాహానికి ముందు వైద్య పరీక్ష తప్పనిసరి అయితే, జన్యు పరీక్ష ఐచ్ఛికంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎమిరేట్స్ జీనోమ్ కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేసింది.
కార్డియోమయోపతి, జన్యు మూర్ఛ, వెన్నెముక కండరాల క్షీణత, వినికిడి లోపం, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇతర తీవ్రమైన మరియు దీర్ఘకాలిక వ్యాధులు వంటి వంశపారంపర్య వ్యాధులకు కారణమయ్యే 570 జన్యు ఉత్పరివర్తనాలను జన్యు పరీక్ష గుర్తిస్తుందని అంతకుముందు, ఒక ఉన్నత అధికారి చెప్పారు. ఎమిరాటిస్లలో జన్యుపరమైన వ్యాధులను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడే ఒక సమగ్ర జాతీయ జన్యు డేటాబేస్ను రూపొందించడం ఈ విధానం లక్ష్యమని పేర్కొన్నారు.
యూఏఈ సెంటెనియల్ విజన్ 2071కి అనుగుణంగా సుస్థిరమైన అభివృద్ధిని, మెరుగైన జీవన నాణ్యతను నిర్ధారించడానికి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, ఈ నిర్ణయం ఆరోగ్య సంరక్షణ రంగంలో పరివర్తనాత్మక మార్పును తీసుకువస్తుందని ఆరోగ్య , నివారణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వివాహం చేసుకోబోయే ఎమిరాటిస్లకు జన్యు పరీక్షను అమలు చేయడానికి, సంబంధిత అధికారులందరితో సన్నిహిత సహకారంతో ఒకే జాతీయ బృందంగా పనిచేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. జనవరి 2025 ప్రారంభం నుండి పౌరులందరికీ రిటల్ జన్యు పరీక్ష తప్పనిసరి కానుంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు









