'బాబు బంగారం' చిత్రీకరణ తుది దశకు చేరుకుంది..
- June 27, 2016
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'బాబు బంగారం' సినిమాతో త్వరలో వినోదాల విందు వడ్డించనున్నారు వెంకటేష్. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇటీవల గచ్చిబౌలిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఓ పాట మినహా సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చిందట. ఈ పాట కోసం చెన్నైలో ప్రత్యేక సెట్ సిద్ధం చేయించారట దర్శకుడు. జులై 4 నుండి 8 వరకు జరుగనున్న షూటంగ్తో ఈ పాట కూడా పూర్తవుతుందట. జిబ్రాన్ స్వరాలు సమకూర్చిన పాటలు జులై 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయట. జులై 29 నాటికి 'బాబు బంగారం'ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో నయనతార కథానాయిక.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









