Dh641 మిలియన్ల మనీలాండరింగ్.. ఇంటర్నేషనల్ నెట్వర్క్స్ బస్ట్..!!
- December 27, 2024
యూఏఈ: మొత్తం Dh641 మిలియన్ల విలువైన మనీ-లాండరింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న రెండు ప్రధాన అంతర్జాతీయ క్రైమ్ నెట్వర్క్లను దుబాయ్లోని అధికారులు ఛేదించారు.
మొదటి కేసులో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ఎమిరాటీ, 21 మంది బ్రిటీష్ పౌరులు, ఇద్దరు అమెరికన్లు, ఒక చెక్ జాతీయులు, ఎమిరాటీ జాతీయుడికి చెందిన రెండు కంపెనీలను దుబాయ్ కోర్టులలోని క్రిమినల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్కు రెఫర్ చేసింది. ఆయా సంస్థలు Dh461 మిలియన్ల అక్రమ నిధులను కలిగి ఉన్నారని, అలాగే అధికారిక పత్రాలను ఫోర్జరీ చేయడం, వాటిని ఉపయోగించడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. తమ అక్రమ మూలాలను మరుగుపరిచేందుకు రెండు స్థానిక కంపెనీలను ముందుంచుకుని యుకె నుండి యూఏఈకి నిధులు అక్రమంగా తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నెట్వర్క్ నకిలీ పత్రాలను ఉపయోగించిందని గుర్తించారు.UKలో చట్టబద్ధమైన వాణిజ్యం నుండి వచ్చిన నిధులను తప్పుగా ప్రకటించడం ద్వారా కస్టమ్స్ తనిఖీలను తప్పించుకున్నట్లు విచారణలో గుర్తించారు.
అధికారులు జరిపిన మరో విజయవంతమైన ఆపరేషన్లోDh180 మిలియన్ల విలువైన మనీలాండరింగ్ కార్యకలాపాలలో క్రిప్టోకరెన్సీలను ఉపయోగించిన అంతర్జాతీయ వ్యవస్థీకృత క్రైమ్ నెట్వర్క్ ఛేదించారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 30 మంది వ్యక్తులు, మూడు కంపెనీల నెట్వర్క్కు సంబంధించిన కేసును దుబాయ్ కోర్టులలోని మనీ లాండరింగ్ కోర్టుకు రిఫర్ చేసింది. క్రిప్టోకరెన్సీలను ఉపయోగించి Dh180 మిలియన్ల విలువైన సంక్లిష్ట మనీలాండరింగ్ కార్యకలాపాలను నిర్వహించిన ఈ నెట్వర్క్ UK, దుబాయ్లో పనిచేసింది. UK , దుబాయ్లో ఉన్న లైసెన్స్ లేని క్రిప్టోకరెన్సీ మధ్యవర్తుల ద్వారా UKలో నెట్వర్క్ నగదును లాండరింగ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల్లో ఇద్దరు భారతీయులు, ఒక బ్రిటీష్ జాతీయుడు ఉన్నాడు. UKలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసం, పన్ను ఎగవేత వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని అక్రమ పద్ధతుల్లో తరలించారు. పక్కాగా ప్లాన్ చేసిన ఆపరేషన్ నిందితులను అరెస్టు చేసి మనీలాండరింగ్ కార్యకలాపాలకు ఉపయోగించే బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసారు.
దుబాయ్లోని పబ్లిక్ ఫండ్స్ ప్రాసిక్యూషన్, దుబాయ్ ఎకనామిక్ సెక్యూరిటీ సెంటర్, దుబాయ్ పోలీస్ యాంటీ మనీ లాండరింగ్ యూనిట్, యూఏఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, దుబాయ్ కస్టమ్స్, యూఏఈ న్యాయ మంత్రిత్వ శాఖలోని అంతర్జాతీయ సహకార విభాగం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్







