ఎంటర్టైన్మెంట్ సిటీ ప్రాజెక్టుపై చర్చించిన కువైట్ కేబినెట్..!!
- January 02, 2025
కువైట్: బయాన్ ప్యాలెస్లో ప్రధాన మంత్రి అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రణాళికా దశలో ఉన్న ఎంటర్టైన్మెంట్ సిటీ ప్రాజెక్ట్ స్థితిపై చర్చించారు. పునరుద్ధరణ పనుల కోసం ఎంటర్టైన్మెంట్ సిటీని 2016లో మూసివేశారు. ప్రాజెక్ట్ స్థలాన్ని 2.65 మిలియన్ చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. జూలై 2024లో, మునిసిపల్ కౌన్సిల్ ప్రాజెక్ట్ పర్యవేక్షణను కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి బదిలీ చేశారు.
అంతకుముందు, ఒక అధ్యయనం ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు KD 200 మిలియన్లుగా అంచనా వేసింది. ఈ ప్రాజెక్ట్ 2035 నాటికి GDPకి KD 85 మిలియన్లను అందించాలని, 2030 నాటికి 900,000 మంది సందర్శకులతో 4,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. కువైట్ విస్తృత అభివృద్ధి, పెట్టుబడులు,పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్ట్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని క్యాబినెట్ కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీని కోరింది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







