ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు
- January 02, 2025
హైదరాబాద్: 2025 నూతన సంవత్సర వేడుకల్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్, ఉప్పల్, పహాడి షరీఫ్, ఎల్బీనగర్, గూడూరు టోల్గేట్ వంటి ప్రాంతాల్లో స్వయంగా పాల్గొన్నారు.నూతన సంవత్సర వేడుకలు రాచకొండ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలు ఉల్లాసభరితంగా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.కమిషనరేట్ పరిధిలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరియు సివిల్, ట్రాఫిక్, షి టీమ్స్ వంటి అన్ని విభాగాల పోలీసు సిబ్బంది అవిశ్రాతంగా పనిచేయడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.ఈ వేడుకల్లో మల్కాజ్ గిరి డీసీపీ పద్మజ, ఎల్ బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







