ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు

- January 02, 2025 , by Maagulf
ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు

హైదరాబాద్: 2025 నూతన సంవత్సర వేడుకల్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు  కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్, ఉప్పల్, పహాడి షరీఫ్, ఎల్బీనగర్, గూడూరు టోల్గేట్ వంటి ప్రాంతాల్లో స్వయంగా పాల్గొన్నారు.నూతన సంవత్సర వేడుకలు రాచకొండ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలు ఉల్లాసభరితంగా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.కమిషనరేట్ పరిధిలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరియు సివిల్, ట్రాఫిక్, షి టీమ్స్ వంటి అన్ని విభాగాల పోలీసు సిబ్బంది అవిశ్రాతంగా పనిచేయడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.ఈ వేడుకల్లో మల్కాజ్ గిరి డీసీపీ పద్మజ, ఎల్ బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com