ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు
- January 02, 2025
హైదరాబాద్: 2025 నూతన సంవత్సర వేడుకల్లో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్, ఉప్పల్, పహాడి షరీఫ్, ఎల్బీనగర్, గూడూరు టోల్గేట్ వంటి ప్రాంతాల్లో స్వయంగా పాల్గొన్నారు.నూతన సంవత్సర వేడుకలు రాచకొండ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలు ఉల్లాసభరితంగా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.కమిషనరేట్ పరిధిలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరియు సివిల్, ట్రాఫిక్, షి టీమ్స్ వంటి అన్ని విభాగాల పోలీసు సిబ్బంది అవిశ్రాతంగా పనిచేయడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.ఈ వేడుకల్లో మల్కాజ్ గిరి డీసీపీ పద్మజ, ఎల్ బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







