మూడేళ్లలో 13వేల మంది కార్మికులపై బహిష్కరణ వేటు..!!
- January 03, 2025
మనామా: బహ్రెయిన్ గత మూడేళ్లలో 13వేల మంది అక్రమ విదేశీ కార్మికులను బహిష్కరించింది. అయితే, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. పత్రాలు సరిగ్గా లేని కార్మికుల సంఖ్య ఇప్పటికీ 30వేలుగా ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన సెషన్లోLMRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని, 2022 నుండి సందర్శనలు 120% పెరిగాయని తెలిపారు.
2024లోనే దాదాపు 3వేల మంది విదేశీ కార్మికులు పట్టుబడ్డారని తాలిబ్ నివేదించింది. 98% యజమానులు కంప్లైంట్ చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. ఇంకా, తాలిబ్ 2023- 2024 మధ్య వాణిజ్య సంస్థలలో ఉల్లంఘనలలో 48% తగ్గుదలని, అదే కాలంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించబడిన అధీకృత కార్మికుల సంఖ్యలో 54% తగ్గుదల నమోదైందని వెల్లడించింది. ఈ కాలంలో 45వేల మంది కార్మికులు నమోదు అయ్యారని,ఇందులో చాలామంది బహిష్కరించబడ్డారని, లేదా కొత్త యజమానులకు బదిలీ అయినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







