మూడేళ్లలో 13వేల మంది కార్మికులపై బహిష్కరణ వేటు..!!
- January 03, 2025
మనామా: బహ్రెయిన్ గత మూడేళ్లలో 13వేల మంది అక్రమ విదేశీ కార్మికులను బహిష్కరించింది. అయితే, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. పత్రాలు సరిగ్గా లేని కార్మికుల సంఖ్య ఇప్పటికీ 30వేలుగా ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన సెషన్లోLMRA చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ..నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయని, 2022 నుండి సందర్శనలు 120% పెరిగాయని తెలిపారు.
2024లోనే దాదాపు 3వేల మంది విదేశీ కార్మికులు పట్టుబడ్డారని తాలిబ్ నివేదించింది. 98% యజమానులు కంప్లైంట్ చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. ఇంకా, తాలిబ్ 2023- 2024 మధ్య వాణిజ్య సంస్థలలో ఉల్లంఘనలలో 48% తగ్గుదలని, అదే కాలంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించబడిన అధీకృత కార్మికుల సంఖ్యలో 54% తగ్గుదల నమోదైందని వెల్లడించింది. ఈ కాలంలో 45వేల మంది కార్మికులు నమోదు అయ్యారని,ఇందులో చాలామంది బహిష్కరించబడ్డారని, లేదా కొత్త యజమానులకు బదిలీ అయినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







