మూతపడ్డ ప్రసిద్ధ జైస్ అడ్వెంచర్ పార్క్..!!
- January 03, 2025
యూఏఈ: రస్ అల్ ఖైమాలో ప్రసిద్ధ జైస్ అడ్వెంచర్ తాత్కాలికంగా మూతపడ్డది. ప్రస్తుతం పునఃప్రారంభ తేదీని నిర్ణయించలేదని జైస్ అడ్వెంచర్ పార్క్ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. పార్కులోని పొడవైన టోబోగాన్ రైడ్ వారం నుండి పనిచేయడం లేదు. అయితే, మూసివేతకు ఖచ్చితమైన కారణాన్ని చెప్పకపోయినా.. నిర్వహణ పనుల కోసమే పార్కును మూసివేసినట్లు తెలుస్తోంది. యూఏఈలోని ఎత్తైన పర్వతమైన రస్ అల్ ఖైమా జెబెల్ జైస్ యొక్క అడ్వెంచర్ కాంప్లెక్స్లో జైస్ స్లెడర్ ఎనిమిది సవారీలు ప్రధాన ఆకర్షణలలో ఒకటి. అదే పరిసరాల్లో థ్రిల్ కోరుకునేవారు హైకింగ్కు వెళ్లవచ్చు లేదా ప్రపంచంలోనే అతి పొడవైన జిప్లైన్ని ప్రయత్నించవచ్చు. 2022లో ప్రారంభించినప్పటి నుండి జైస్ స్లెడర్ ప్రసిద్ధ రైడ్ గా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









