హాస్పిటల్ ను వేలం వేసి అప్పులు తీర్చండి..కోర్టు కీలక ఆదేశాలు..!!
- January 04, 2025
యూఏఈ: ఆరోగ్య సంరక్షణ సదుపాయంలో వైద్య పరికరాల వేలం వేసి, డాక్టర్లు, నర్సుల జీతాలతో సహా రుణదాతల అప్పులు చెల్లించాలని దుబాయ్లోని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనవరి 7 సాయంత్రం 5 గంటలకు రస్ అల్ ఖోర్ ప్రదేశంలో వేలం నిర్వహించనున్నట్లు కోర్టు ఆర్డర్స్ ద్వారా తెలుస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కూడా పాల్గొనవచ్చు. వేలం వేసే వస్తువులలో ఎక్స్-రే యంత్రాలు, ఆటోమేటెడ్ ఎనలైజర్లు, బెడ్స్, ఇన్ఫ్యూషన్ పంపులు, రక్తపోటు మానిటర్లు, బ్రోంకోస్కోపీ పరికరాలు 1.7 మిలియన్ దిర్హాంలు విలువ చేసే కాథెటరైజేషన్ కార్డియాక్ సిస్టమ్ ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ 22 మిలియన్ దిర్హాన్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్రమ శాటిలైట్ ఛానళ్ల ప్రసార ముఠాను ఛేదించిన దుబాయ్ పోలీసులు
- పీఎం కిసాన్ 23వ విడత నిధులు విడుదల
- భారత మేధో, సాంస్కృతిక పునరుజ్జీవనానికి బెంగాల్ కేంద్రబిందువు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన







