బిజినెస్ బే నైఫ్ అటాక్ కేసు: జైలు శిక్షను సమర్థించిన దుబాయ్ కోర్టు..!!
- January 07, 2025
యూఏఈ: దుబాయ్లోని బిజినెస్ బే ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన గొడవలో ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి చేసి, వారిని బెదిరించి, అభ్యంతరకరమైన పదజాలంతో దాడి చేసినందుకు నిందితుడికి మూడు నెలల జైలు శిక్షను దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. కేసు రికార్డుల ప్రకారం, ఈ సంఘటన ఏప్రిల్ 4, 2024న తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగింది. మొదటి బాధితుడు బిజినెస్ బే ప్రాంతంలో పని ముగించుకుని తన కారులో ఎక్కాడని, నిందితుడి సహచరుడు వెనుక ప్రయాణీకుడి తలుపు తెరిచి అతని మెడ చుట్టూ పట్టుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు బాధితుడి పక్కన ఉన్న డ్రైవర్ సీటులోకి వచ్చి, తనపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ వారిని వేరే చోటికి తీసుకెళ్లాలని కత్తితో దాడి చేశారు బాధితుడు తెలిపారు. అనంతరం కొందరు నిందితుడిని పట్టుకునేందుకు యత్నించగా, కత్తితో దాడికి పాల్పడ్డాడు. మొదటి బాధితుడికి తొడపై కత్తిపోట్లు పడగా, రెండవ బాధితుడి చేతులకు కోతలు ఉన్నాయని వైద్య నివేదికలు వెల్లడించాయి. మూడో బాధితుడి ముఖంపై కత్తితో గాయమైంది. కాగా, విచారణ సమయంలో నిందితుడు తనపై వచ్చి ఆరోపణలను ఖండించారు. కేవలం తన స్నేహితుడికి సంబంధించిన వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించినట్టు తెలిపాడు. అయితే, బాధితుల వాంగ్మూలాలు, మెడికల్ రికార్డులతో సహా సమర్పించిన సాక్ష్యాలు అతడిని దోషిగా నిర్ధారించడానికి సరిపోతాయని కోర్టు గుర్తించింది. నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, అనంతరం బహిష్కరించాలని విధించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









