బిజినెస్ బే నైఫ్ అటాక్ కేసు: జైలు శిక్షను సమర్థించిన దుబాయ్ కోర్టు..!!
- January 07, 2025
యూఏఈ: దుబాయ్లోని బిజినెస్ బే ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన గొడవలో ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి చేసి, వారిని బెదిరించి, అభ్యంతరకరమైన పదజాలంతో దాడి చేసినందుకు నిందితుడికి మూడు నెలల జైలు శిక్షను దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది. కేసు రికార్డుల ప్రకారం, ఈ సంఘటన ఏప్రిల్ 4, 2024న తెల్లవారుజామున 2:45 గంటలకు జరిగింది. మొదటి బాధితుడు బిజినెస్ బే ప్రాంతంలో పని ముగించుకుని తన కారులో ఎక్కాడని, నిందితుడి సహచరుడు వెనుక ప్రయాణీకుడి తలుపు తెరిచి అతని మెడ చుట్టూ పట్టుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు బాధితుడి పక్కన ఉన్న డ్రైవర్ సీటులోకి వచ్చి, తనపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ వారిని వేరే చోటికి తీసుకెళ్లాలని కత్తితో దాడి చేశారు బాధితుడు తెలిపారు. అనంతరం కొందరు నిందితుడిని పట్టుకునేందుకు యత్నించగా, కత్తితో దాడికి పాల్పడ్డాడు. మొదటి బాధితుడికి తొడపై కత్తిపోట్లు పడగా, రెండవ బాధితుడి చేతులకు కోతలు ఉన్నాయని వైద్య నివేదికలు వెల్లడించాయి. మూడో బాధితుడి ముఖంపై కత్తితో గాయమైంది. కాగా, విచారణ సమయంలో నిందితుడు తనపై వచ్చి ఆరోపణలను ఖండించారు. కేవలం తన స్నేహితుడికి సంబంధించిన వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించినట్టు తెలిపాడు. అయితే, బాధితుల వాంగ్మూలాలు, మెడికల్ రికార్డులతో సహా సమర్పించిన సాక్ష్యాలు అతడిని దోషిగా నిర్ధారించడానికి సరిపోతాయని కోర్టు గుర్తించింది. నిందితుడికి మూడు నెలల జైలు శిక్ష, అనంతరం బహిష్కరించాలని విధించారు.
తాజా వార్తలు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!
- యూఏఈలో ఎండల తీవ్రత.. 50.4°C ఉష్ణోగ్రత నమోదు..!!
- అబుదాబిలో భారతీయ లస్సీ షాప్ తాత్కాలికంగా మూసివేత..!!
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..







