. ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పొ సంస్థ సంసిద్ధత .
- June 28, 2016
ఏపీని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని గుయాంగ్ ప్రావిన్స్ వైస్ గవర్నర్ను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు.చైనాలో సీఎం చంద్రబాబు నాలుగో రోజు పర్యటనలో భాగంగా గుయాంగ్ సిటీ వైస్గవర్నర్ను కలిశారు. నీరు-చెట్టు విషయంలో కఠిన నిబంధనలు పాటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అనంతరం ఒప్పొ మొబైల్ ఉత్పత్తుల కంపెనీ వైస్ ప్రెసిడెంట్..ఎండీ, ప్లానింగ్ డైరెక్టర్తో చంద్రబాబు భేటీ అయ్యారు. హార్డ్వేర్కు ఎంతో డిమాండ్ ఉందని, పాలనలో ఐటీ వినియోగంలో తాము ముందున్నామని చంద్రబాబు వారికి వివరించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, 21 రోజుల్లో సింగిల్ డెస్క్ ద్వారా కంపెనీలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. ఏపీలో రూ.1000 కోట్ల పెట్టుబడులకు ఒప్పొ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. 25వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఒప్పో హామీ ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. జులైలో ఏపీలో పర్యటించి భూములు ఎంపిక చేసుకోవాలని ఒప్పొ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. చైనాలో అతిపెద్ద డేటా సెంటర్ చైనా యూనికామ్ను సందర్శించిన చంద్రబాబు దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్స్కాన్ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ను చంద్రబాబు పరిశీలించి వారితో మాట్లాడారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







