యు.ఆర్ అడ్వాన్స్డ్ థెర్ప్యూటిక్స్ పరిశోధనశాలను సందర్శించిన వెంకయ్యనాయుడు
- January 09, 2025
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో ఏర్పాటు చేసిన అంకుర పరిశ్రమ యు.ఆర్ అడ్వాన్స్డ్ థెర్ప్యూటిక్స్ పరిశోధనశాలను గురువారం సందర్శించాను.శారీరిక రుగ్మతలకు మానవ మూల కణాలతో చికిత్స చేసే అధునాతన, మెరుగైన ప్రత్యామ్నాయ విధానాన్నిఈ అంకుర పరిశ్రమలో అభివృద్ధి చేస్తున్నారని తెలిసి సంతోషించాను. ఎటువంటి దుష్ప్రభావాలు ఉండని మూలకణాల ఆధారిత చికిత్స కు సంబంధించి ఈ సంస్థ పరిశోధనలో కొన్ని విజయాలు సాధించిందని, మేధోహక్కులను పొందిందని తెలిసి సంతోషం అనిపించింది.శరీరంలో రుగ్మతలకు లోనైన వివిధ అవయవాలు,అవయవ భాగాలు పునరుజ్జీవం పొందటానికి మూల కణాలు దోహదం చేస్తాయని పరిశోధనలు ఇప్పటికే రుజువు చేయగా అటువంటి చికిత్స విధానాలను హైదరాబాదులో అభివృద్ధి చేయటం సంతోషకరమైన విషయం.తక్కువ ఖర్చులో మెరుగైన వైద్య చికిత్స అందించే ఇలాంటి పరిశోధనలు భారత్ లో మరిన్ని జరగాలని, యువతరం ఇందుకు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాను.యు.ఆర్ అడ్వాన్స్డ్ థెర్ప్యూటిక్స్ సీఈవో జగన్మోహన్ రెడ్డికి అభినందనలు.
తాజా వార్తలు
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు









