చెన్నమనేని స్వీయ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
- January 12, 2025
హైదరాబాద్: ‘ఉనిక’ పేరుతో చెన్నమనేని విద్యాసాగర్ రావు స్వీయ చరిత్ర పుస్తకాన్ని హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వారు.. విద్యాసాగర్ రావు గొప్ప వ్యక్తి కొనియాడారు. విద్యాసాగర్ రావు సమర్థతను మోడీ గుర్తించి గవర్నర్ చేశారని తెలిపారు. విధానాల్లో వ్యతిరేకిస్తుండవచ్చు. వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా నిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో జైపాల్ రెడ్డి, కేశవరావు, విద్యాసాగర్ రావు రాజకీయాల్లో ఆదర్శంగా నిలిచారు.తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే క్రీయాశీలకమైన వ్యక్తులను వైస్ ఛాన్స్ లర్ లను నియమించినట్టు తెలిపారు.
సమాజంలో ఏదైనా సమస్యలుంటే ప్రజలు విద్యార్థి పోరాటం ద్వారానే మన యూనివర్సిటీల చైతన్యం అన్నారు. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, విద్యా సాగర్ రావు నిలదీయడంలో ముఖ్యమైన వారు. పాలక పక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







