ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి: మంత్రి పార్థసారధి
- January 14, 2025
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు మంత్రి కొలుసు పార్థసారధి. జగన్ వ్యవహార శైలి మార్చుకోవడం లేదనే అందరూ వైసీపీని వీడుతున్నారని మంత్రి పార్థసారధి అన్నారు. సంక్రాంతి కేవలం కూటమి నాయకులకే అని వైసీపీ నేతలంటున్నారు.. సంక్రాంతి ఎవరికో అవగాహన లేకుండా, క్షేత్రస్ధాయిలో అంశాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంలో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్నీ పునరుద్ధరించామన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేస్తోందని వివరించారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భయానికి గురైన ప్రజల భయాన్ని పోగొట్టామన్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించి 5 రూపాయలకే ఆకలి తీరుస్తున్నామన్నారు. NREGS ద్వారా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సిమెంట్ రోడ్లు గ్రామాలకు వచ్చాయని మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు. వైసీపీ పాలనలో 6,679 కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తే.. కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే 85వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిందన్నారు.
ఏపీలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. 65 వేల కోట్లతో సిబిజి ప్లాంట్లు పెట్టడానికి MoUతో పాటు అనుమతులు కూడా వచ్చాయన్నారు మంత్రి కొలుసు పార్థసారధి.
తాజా వార్తలు
- కేదార్నాథ్ యాత్రలో విషాదం..ముగ్గురు భక్తులు మృతి
- సీఎంగా తొలిసారి ప్రజల్లోకి విజయ్..
- ప్రపంచ వేదిక పై హైదరాబాద్ క్రీడా హ్యాకథాన్కు విశిష్ట గుర్తింపు
- గూగుల్కు రూ.30 లక్షల జరిమానా..హైకోర్టు కీలక తీర్పు
- యాత్రికులకు 25 లక్షలకు పైగా వైద్యసేవలు అందజేత..!!
- నార్త్ అల్ బతినాలో ఆర్థోడాంటిక్ క్లినిక్ సీజ్..!!
- 20వేల డాలర్ల నగదు, గోల్డ్ ఉన్న బ్యాగ్ ను పోగొట్టుకున్న ప్రయాణికురాలు..!!
- డొమెస్టిక్ వర్కర్ చెవి కొరికిన వ్యక్తికి జైలు శిక్ష..!!
- 73 మిలియన్లు దాటిన పేమెంట్స్ సిస్టమ్ లావాదేవీలు..!!
- జూన్ 1 నుండి మిడ్ డే డెలివరీలపై నిషేధం..!!









