రియాద్ పర్యటకు బయలుదేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

- January 14, 2025 , by Maagulf
రియాద్ పర్యటకు బయలుదేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రియాద్: రియాద్ లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న *‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’ లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు రియాద్ బయలుదేరి వెళ్ళారు. 'టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్' థీమ్ తో ఈ సమావేశాలు జరగనున్నాయి. 

ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై ఈ సందర్భంగా విస్తృతమైన చర్చ ఉంటుంది.
అనంతరం వివిధ దేశాల గనుల శాఖ మంత్రులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.

ఈ కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రులు, కంపెనీల సీఈవోలు ఈ కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్నారు. ఖనిజ సంపదపై ఫలప్రదమైన చర్చ జరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖనిజ సంపద సద్వినియోగం అవ్వాలన్న లక్ష్యంతో సౌదీ అరేబియా ప్రభుత్వం రియాద్ వేదికగా మూడేళ్లుగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com