BAPS హిందూ మందిర్ ను సందర్శించిన 20దేశాల డిఫిన్స్ అధికారులు..!!
- January 15, 2025
అబుదాబి: అబుదాబిలోని BAPS హిందూ మందిర్ ను 20 కంటే ఎక్కువ రాయబార కార్యాలయాలకు చెందిన డిఫిన్స్ అధికారులు, వారి కుటుంబాలు సందర్శించారు. BAPS స్వామినారాయణ్ సంస్థ కృషితో నిర్మించిన మందిర్ ప్రారంభమైన ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో ప్రపంచం నలుమూలల నుండి రెండు మిలియన్ల మంది సందర్శకులు సందర్శించారు. బెల్జియం, కెనడా, కొమొరోస్ ద్వీపం, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఈజిప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇండియా, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, కొరియా, మొజాంబిక్, టాంజానియా, సెర్జియా, స్విట్జర్లాండ్ దేశాల రక్షణ శాఖ అధికారులు ఉన్నారు. ప్రతినిధులకు BAPS బోర్డు సభ్యులు, వాలంటీర్లు సంప్రదాయ దండలు మరియు గులాబీలతో సాదరంగా స్వాగతం పలికారు. అబుదాబిలోని BAPS హిందూ మందిర్ అద్భుతమైన ప్రయాణాన్ని తెలిపే 'ది 'ఫెయిరీ టేల్' ప్రదర్శనను చూసి ప్రతినిధులు మంత్రముగ్ధులయ్యారు. మందిర్ ముఖద్వారంపై చెక్కబడిన ప్రాచీన నాగరికత విలువను తెలియజేసే కళాత్మకతను చూసి ప్రశాలు కురిపించారు. అనంతరం ప్రతినిధులు తమ ఆలోచనలను పంచుకోవడంతో వారి పర్యటన ముగిసింది.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







