విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం శుభవార్త..
- January 16, 2025
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. 11వేల 500 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్వహణను కొనసాగించనున్నారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా, నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కోంటోంది. దీన్ని అధిగమించేందుకు స్పెషల్ ప్యాకేజీ అందించాలని నిర్ణయించుకుంది సెంట్రల్ క్యాబినెట్.
విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీ అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి..
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించారు. అయితే, ఆర్థిక ప్యాకేజీపై శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కలిసినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీ అందించాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిద్ధమైన కేంద్రం..
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. అయితే, నష్టాల్లో ఉన్న సంస్థను పరిరక్షించేందుకు, దాన్ని ముందుకు నడిపేందుకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సంస్థకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉప సంఘం భేటీ జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







