WPL షెడ్యూల్ రిలీజ్..
- January 17, 2025
ఐపీఎల్ కంటే ముందే క్రికెట్ లవర్స్కు వినోదం పంచేందుకు డబ్ల్యూపీఎల్ (Women's Premier League) సిద్ధం కానుంది. 2025 మహిళల ప్రీమియర్ లీగ్కు సంబంధించిన షెడ్యూల్ రిలీజైంది. ఫిబ్రవరి 14న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఓపెనింగ్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్తో ఢీ కొట్టనుంది.
ఈ టోర్నీకి నాలుగు నగరాలు వేదిక కానున్నాయి. ముంబయి, బెంగళూరు, వడోదర, లఖ్నవూ స్టేడియాల్లో మొత్తం 22 మ్యాచ్లు జరగనున్నాయి. అత్యధికంగా బెంగళూరు 8 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఫైనల్ మ్యాచ్కు ముంబయి వేదిక కానుంది. అన్ని మ్యాచ్లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి.
కాగా, ఫిబ్రవరి 14న మ్యాచ్ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఈ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్కు సంబంధించిన సెలబ్రిటీలు ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొని సందడి చేయనున్నారు. టైటిల్ కోసం మొత్తం 5 జట్లు టోర్నమెంట్లో పోటీపడనున్నాయి.
తాజా వార్తలు
- DP World to expand logistics capacity in Dominican Republic with new US$100 million investment
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!









