ప్రపంచ పెట్టుబడుల మ్యాచ్‌లో ఏపీని చేర్చడానికి సిద్ధం: సీఎం చంద్రబాబు

- January 19, 2025 , by Maagulf
ప్రపంచ పెట్టుబడుల మ్యాచ్‌లో ఏపీని చేర్చడానికి సిద్ధం: సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన నిమిత్తం దావోస్ బయల్దేరారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రేపు ప్రారంభం కానుంది.మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన బృందం పాల్గొననున్నారు.

ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం…రాత్రి 1.30 గంటలకు జ్యూరిచ్ వెళ్లనుంది.

కాగా, రేపు ప్రారంభం కానున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు సీఎం బృందం హాజరుకానుంది.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు…

‘‘ప్రపంచ పెట్టుబడుల మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ చేర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. నేను స్విట్జర్లాండ్‌లోని దావోస్-క్లోస్టర్స్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సమావేశానికి GoAP నుండి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com