రసరాగవాహిని ఆధ్వర్యంలో ఘనంగా సంగీత విభావరి
- January 19, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై రసరాగవాహిని నిర్వహణలో హిందీ తెలుగు సినిమా పాటల గాన విభావరి ఘనంగా జరిగింది.సుమారు ముఫ్పై మంది గాయనీ గాయకులు పలు పాటలను మధుర సుధా రస భరితంగా గానం చేశారు.యుగంధర్, శ్రీనివాస్ మూర్తి, చిదంబర శాస్త్రి, దక్షిణా మూర్తి, రామమూర్తి, కామేశ్వరి, కనక దుర్గ, భార్గవి, లక్ష్మి తదితరులు గాన విభావరి లో పాలు పంచుకున్నారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వంశీ రామరాజు మాట్లాడుతూ... సంగీతం సర్వ మానసిక రోగ నివారిణి అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు. టివీలో సీరియల్స్ వల్ల ఉపయోగం ఉండదు అనీ మంచి పాటలు ఉత్సాహం ఉల్లాసం కలిగిస్తాయని చెప్పారు.వయోధికులు సైతం ఆసక్తి తో పాటలు పాడి ఆకట్టుకున్నారని అభినందించారు. సంస్థ వ్యవస్థాపకుడు పొన్నపల్లి రవి శంకర్ స్వాగతం పలుకుతూ రెండు తెలుగు రాష్ట్రాలు చెందిన గాయనీ గాయకులుతో పాటు అమెరికా నుంచి కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారని తెలిపారు.పోన్నపల్లి కామేశ్వరి కార్యక్రమ పర్యవేక్షణ చేశారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







