రసరాగవాహిని ఆధ్వర్యంలో ఘనంగా సంగీత విభావరి
- January 19, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై రసరాగవాహిని నిర్వహణలో హిందీ తెలుగు సినిమా పాటల గాన విభావరి ఘనంగా జరిగింది.సుమారు ముఫ్పై మంది గాయనీ గాయకులు పలు పాటలను మధుర సుధా రస భరితంగా గానం చేశారు.యుగంధర్, శ్రీనివాస్ మూర్తి, చిదంబర శాస్త్రి, దక్షిణా మూర్తి, రామమూర్తి, కామేశ్వరి, కనక దుర్గ, భార్గవి, లక్ష్మి తదితరులు గాన విభావరి లో పాలు పంచుకున్నారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వంశీ రామరాజు మాట్లాడుతూ... సంగీతం సర్వ మానసిక రోగ నివారిణి అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు. టివీలో సీరియల్స్ వల్ల ఉపయోగం ఉండదు అనీ మంచి పాటలు ఉత్సాహం ఉల్లాసం కలిగిస్తాయని చెప్పారు.వయోధికులు సైతం ఆసక్తి తో పాటలు పాడి ఆకట్టుకున్నారని అభినందించారు. సంస్థ వ్యవస్థాపకుడు పొన్నపల్లి రవి శంకర్ స్వాగతం పలుకుతూ రెండు తెలుగు రాష్ట్రాలు చెందిన గాయనీ గాయకులుతో పాటు అమెరికా నుంచి కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారని తెలిపారు.పోన్నపల్లి కామేశ్వరి కార్యక్రమ పర్యవేక్షణ చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!







