రసరాగవాహిని ఆధ్వర్యంలో ఘనంగా సంగీత విభావరి
- January 19, 2025
హైదరాబాద్: హైదరాబాద్ లోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై రసరాగవాహిని నిర్వహణలో హిందీ తెలుగు సినిమా పాటల గాన విభావరి ఘనంగా జరిగింది.సుమారు ముఫ్పై మంది గాయనీ గాయకులు పలు పాటలను మధుర సుధా రస భరితంగా గానం చేశారు.యుగంధర్, శ్రీనివాస్ మూర్తి, చిదంబర శాస్త్రి, దక్షిణా మూర్తి, రామమూర్తి, కామేశ్వరి, కనక దుర్గ, భార్గవి, లక్ష్మి తదితరులు గాన విభావరి లో పాలు పంచుకున్నారు.అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వంశీ రామరాజు మాట్లాడుతూ... సంగీతం సర్వ మానసిక రోగ నివారిణి అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు. టివీలో సీరియల్స్ వల్ల ఉపయోగం ఉండదు అనీ మంచి పాటలు ఉత్సాహం ఉల్లాసం కలిగిస్తాయని చెప్పారు.వయోధికులు సైతం ఆసక్తి తో పాటలు పాడి ఆకట్టుకున్నారని అభినందించారు. సంస్థ వ్యవస్థాపకుడు పొన్నపల్లి రవి శంకర్ స్వాగతం పలుకుతూ రెండు తెలుగు రాష్ట్రాలు చెందిన గాయనీ గాయకులుతో పాటు అమెరికా నుంచి కూడా కార్యక్రమంలో పాలు పంచుకున్నారని తెలిపారు.పోన్నపల్లి కామేశ్వరి కార్యక్రమ పర్యవేక్షణ చేశారు.
తాజా వార్తలు
- 'రైల్ వన్’ యాప్లో ఉచిత OTT వినోదం!
- ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి









