జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- January 20, 2025
జ్యూరిచ్: రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తమతమ బృందాలతో దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో వీరు పాల్గొంటారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదతరులు ఏపీ నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరగా.. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి దావోస్ పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో వారు సోమవారం జ్యూరిచ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో చంద్రబాబు నాయుడు బృందానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బృందం తారసపడింది. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పలుకరించుకున్నారు. మంత్రుల బృందంతో ఎయిర్ పోర్టులో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోను టీటీడీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుంది.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







