పాస్‌పోర్టులు, సీల్స్‌ ఫోర్జరీ..ఐదుగురికి జైలుశిక్ష..!!

- January 21, 2025 , by Maagulf
పాస్‌పోర్టులు, సీల్స్‌ ఫోర్జరీ..ఐదుగురికి జైలుశిక్ష..!!

మనామా: దేశం విడిచి పారిపోవడానికి పాస్ పోర్టులు, సీల్స్ ను ఫోర్జరీ చేసిన ఐదుగురు వ్యక్తులకు మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించింది. బహ్రెయిన్ జాతీయత, పాస్‌పోర్ట్‌లు, రెసిడెన్సీ జనరల్ డైరెక్టరేట్ లోగోను, అధికారుల సంతకాలను ఉపయోగించి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కాగా, ఒక నిందితుడు సౌదీ అరేబియా, కువైట్ గుండా ఇరాక్ చేరుకోవడానికి ముందు కింగ్ ఫహద్ కాజ్‌వే గుండా తప్పించుకున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రకారం.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిన దర్యాప్తు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com