అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు
- January 22, 2025
హైదరాబాద్: 11 నవంబర్ 2024న 36 వారాల గర్భధారణ సమయంలో 1.79 కిలోల బరువుతో జన్మించిన ఆడపిల్ల, పిత్త వాంతులు మరియు మూత్రం తగ్గడం వంటి లక్షణాలతో 17 నవంబర్ 2024న NICUలో చేర్చడం జరిగింది.అడ్వాన్స్డ్ డయాగ్నస్టిక్ ఇమేజింగ్ ద్వారా మిడ్గట్ వాల్వులస్ మరియు మాల్రోటేషన్తో శిశువు బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగింది.అనంతరం శిశువుకు 20 నవంబర్ 2024న డాక్టర్ మధు మోహన్ రెడ్డి, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె డాక్టర్ నవిత ఎమ్, మరియు డా. వంశీ రెడ్డి వారి బృందం సుమారుగా 4 గంటలు కస్టపడి శస్త్రచికిత్స నిర్వహించి డ్యూడెనమ్ను నిఠారుగా చేసి , మెసెంటరీని వెడల్పు చేయడం, సంశ్లేషణలను విడుదల చేయడం, అపెండెక్టమీ మరియు ప్రేగులను తిరిగి వాటి స్థానంలో ఉంచడం జరిగింది. శస్త్రచికిత్స తర్వాత శిశువుని NICU లో ఉంచి IV యాంటీబయాటిక్స్ మరియు పోషకాహారం అందించడం జరిగింది.ఒక వారంలోనే నోటి ద్వారా ఫీడ్ ను అందించేలాగా పురోగతి సాధించింది.శిశువు 27 నవంబర్ 2024న స్థిరమైన స్థితిలో 1.77 కిలోల బరువుతో డిశ్చార్జ్ చేయబడింది. డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె గారు మాట్లాడుతూ “మిడ్గట్ వాల్వులస్ విత్ మాల్రోటేషన్ అనేది ప్రాణాంతక పరిస్థితి, దీనికి సకాలంలో చికిత్స చాలా అవసరం .మాల్రోటేషన్ అనేది పుట్టుకతో వచ్చే (పుట్టుకలో ఉన్న) పరిస్థితి, ఇది శిశువు యొక్క చిన్న మరియు పెద్ద ప్రేగులను వారి పొత్తికడుపు (బొడ్డు) లోపల ఉంచడాన్ని ప్రభావితం చేస్తుంది. పిండం అభివృద్ధి ప్రారంభంలో ప్రేగులు ఏర్పడతాయి.ఆ ప్రక్రియలో భాగంగా, పేగులు సరైన స్థానానికి చేరుకునే వరకు చుట్టుకొని తిరుగుతాయి మరియు ఉదర గోడకు జోడించబడతాయి. కానీ కొన్ని సందర్భాల్లో, అవి సరిగ్గా కాయిల్ మరియు రొటేట్ చేయవు. దీన్నే ఇంటెస్టినల్ మాల్రోటేషన్ అంటారు.వోల్వులస్ అనేది మీ పిల్లల ప్రేగులకు రక్త సరఫరాను రాజీ చేసే ప్రేగులను అసాధారణంగా తిప్పడం.ఇది మాల్రోటేషన్ యొక్క ప్రధాన సమస్య అని అన్నారు.
సెంటర్ హెడ్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ...నవజాత శిశువులో పేగు సంబంధమైన లోపంతో కూడిన మిడ్గట్ వాల్వులస్కు సంబంధించిన అరుదైన మరియు క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా కావడం ఇది ఆసుపత్రి యొక్క అధునాతన పీడియాట్రిక్ సర్జికల్ నైపుణ్యం మరియు నియోనాటల్ కేర్ సామర్థ్యాలను నిదర్శనం అని అన్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









