బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ
- January 22, 2025
బిల్ గేట్స్తో CIYEM చంద్రబాబు భేటీ
దావోస్: దావోస్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో 3వ రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎంతో భేటీ కానున్న వారిలో డీపీ వరల్డ్ గ్రూపు, యునీలీవర్, గూగుల్ క్లౌడ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), పెప్సీకో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులు ఉన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను ఆయా సంస్థల అధినేతలతో భేటీ అయి చంద్రబాబు వివరించనున్నారు.
పునరుత్పాదక విద్యుత్ పై ఫోకస్..
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధితోనూ నేడు చంద్రబాబు చర్చలు జరుపుతారు. ఏపీకి పెట్టుబడుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.దావోస్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్కోతో ఎంవోయూ కుదుర్చుకోనుంది. తద్వారా ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్ పై ఫోకస్ చేస్తారు.పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు చంద్రబాబు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!