మనీ ఎక్స్ఛేంజ్‌లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!

- January 23, 2025 , by Maagulf
మనీ ఎక్స్ఛేంజ్‌లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!

కువైట్: మహ్బౌలా ప్రాంతంలో మనీ ఎక్స్ఛేంజ్‌లో సాయుధ దోపిడీకి పాల్పడిన నైజీరియన్ ముఠాను 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారి వద్ద నుండి 4600 దీనార్ల విలువైన విదేశీ కరెన్సీలను స్వాధీనం చేసుకున్నారు.చోరీ చేసిన వాహనాలను నిందితులు ఉపయోగించారని పేర్కొన్నారు.నిందితులలో ఒకరిని మహబూలా ప్రాంతంలో అరెస్ట్ చేయగా, ఇతర నిందితుతులను అల్-ఖురైన్ మార్కెట్స్ ప్రాంతంలో అరెస్టు చేశారు. అనంతరం వారి ఇంటి నుండి చోరీ చేసి నగదుతోపాటు మాదక ద్రవ్యం (షాబు)ను స్వాధీనం చేసుకున్నారు.  నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాసిక్యూషన్ కార్యాలయానికి రెఫర్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com