ఖతార్లో జంతువులు నమోదు తప్పనిసరి.. మూడేళ్ల జైలుశిక్ష..!!
- January 24, 2025
దోహా, ఖతార్: ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఖతార్లో మంత్రిత్వ శాఖలు ప్రమాదకరమైన జంతువులు, జీవుల సర్వే చేపట్టాయి. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ సర్వే.. చట్టం నెం. (10) ఆఫ్ 2019 ప్రమాదకరమైన జంతువులు, జీవులను నియంత్రించనుంది. సర్వే నేపథ్యంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ గుర్తించిన జంతువులు, జీవుల యజమానులు సంబంధిత ఫారమ్ ద్వారా నమోదు చేసుకోవాలని, [email protected]కి ఇమెయిల్ ద్వారా అప్లికేషన్లను సమర్పించాలని సూచించింది. రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 22గా పేర్కొంది. అధికారుల నుండి లైసెన్స్ లేని జంతువులు, జీవులను కలిగిఉండటం నేరంగా పరిగణించబడుతుందని, చట్టం ప్రకారం శిక్షార్హమని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. చట్టంలోని ఆర్టికల్ (8) ప్రకారం.. మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష, QR 100,000వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









