ఖతార్లో జంతువులు నమోదు తప్పనిసరి.. మూడేళ్ల జైలుశిక్ష..!!
- January 24, 2025
దోహా, ఖతార్: ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఖతార్లో మంత్రిత్వ శాఖలు ప్రమాదకరమైన జంతువులు, జీవుల సర్వే చేపట్టాయి. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ సర్వే.. చట్టం నెం. (10) ఆఫ్ 2019 ప్రమాదకరమైన జంతువులు, జీవులను నియంత్రించనుంది. సర్వే నేపథ్యంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ గుర్తించిన జంతువులు, జీవుల యజమానులు సంబంధిత ఫారమ్ ద్వారా నమోదు చేసుకోవాలని, [email protected]కి ఇమెయిల్ ద్వారా అప్లికేషన్లను సమర్పించాలని సూచించింది. రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 22గా పేర్కొంది. అధికారుల నుండి లైసెన్స్ లేని జంతువులు, జీవులను కలిగిఉండటం నేరంగా పరిగణించబడుతుందని, చట్టం ప్రకారం శిక్షార్హమని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. చట్టంలోని ఆర్టికల్ (8) ప్రకారం.. మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష, QR 100,000వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







