ఖతార్లో జంతువులు నమోదు తప్పనిసరి.. మూడేళ్ల జైలుశిక్ష..!!
- January 24, 2025
దోహా, ఖతార్: ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకొని ఖతార్లో మంత్రిత్వ శాఖలు ప్రమాదకరమైన జంతువులు, జీవుల సర్వే చేపట్టాయి. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఈ సర్వే.. చట్టం నెం. (10) ఆఫ్ 2019 ప్రమాదకరమైన జంతువులు, జీవులను నియంత్రించనుంది. సర్వే నేపథ్యంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ గుర్తించిన జంతువులు, జీవుల యజమానులు సంబంధిత ఫారమ్ ద్వారా నమోదు చేసుకోవాలని, [email protected]కి ఇమెయిల్ ద్వారా అప్లికేషన్లను సమర్పించాలని సూచించింది. రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 22గా పేర్కొంది. అధికారుల నుండి లైసెన్స్ లేని జంతువులు, జీవులను కలిగిఉండటం నేరంగా పరిగణించబడుతుందని, చట్టం ప్రకారం శిక్షార్హమని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. చట్టంలోని ఆర్టికల్ (8) ప్రకారం.. మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష, QR 100,000వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







