‘లులూ’లో ఇండియా ఉత్సవ్ 2025 ప్రారంభం..!!

- January 26, 2025 , by Maagulf
‘లులూ’లో ఇండియా ఉత్సవ్ 2025 ప్రారంభం..!!

కువైట్: లులూ హైపర్‌మార్కెట్ ఇండియా 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియా ఉత్సవ్ 2025ని ప్రారంభించింది.ఇది భారతీయ ఉత్పత్తులను ప్రదర్శించే ఫెస్టివల్.. అనేక వస్తువులపై ప్రత్యేక తగ్గింపులను అందిస్తున్నారు. హైపర్‌మార్కెట్‌లోని అల్-రాయ్ అవుట్‌లెట్‌లో గ్రాండ్ ఫెస్టివల్‌ను భారత రాయబారి హెచ్‌ఈ డా.ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు.భారత ఉత్సవ్ 2025 ఉత్సవం ద్వారా భారతీయ ఉత్పత్తులు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు రెండు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించడంలో లులూ హైపర్‌మార్కెట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అంబాసిడర్ స్వైకా తన ప్రసంగంలో తెలిపారు. కువైట్‌లోని హైపర్‌మార్కెట్‌లోని అన్ని అవుట్‌లెట్‌లలో జనవరి 28 వరకు ఇండియా ఉత్సవ్ జరుగుతుంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com