ఏపీ: ఉగాదికి మహిళలకు తీపి కబురు
- January 29, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాదికి మహిళలకు తీపి కబురు చెప్పొబోతోంది. ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. వచ్చే నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి విధి విధానాలు ప్రకటించే A.P.S.R. T. C. అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు చెపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పేరిట మహిళలకు పలు వరాలు ప్రకటించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పథకాల నిరంతరం అధికారులతో సమీక్షిస్తూ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు.ఇందులో భాగంగా పలు పథకాల అమలుపై కేబినెట్ సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ అమలులో లోటుపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరో పథకం అమలుపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలును ఉగాది నుంచే ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!









