వాషింగ్టన్ దుర్ఘటన పై సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- January 31, 2025
రియాద్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో బుధవారం ప్రయాణీకుల విమానం మిలటరీ హెలికాప్టర్ను ఢీకొన్న దుర్ఘటనపై రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సంతాపం తెలిపారు.ఈ మేరకు వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లేఖను పంపినట్లు అధికారులు తలిపారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బుధవారం సాయంత్రం వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ సమీపంలో అమెరికన్ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం,యుఎస్ ఆర్మీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ గాలిలో ఢీకొన్నాయి. 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కూడిన విమానం కాన్సాస్ నుండి బయలుదేరింది. శిక్షణ విమానంలో ఉన్న హెలికాప్టర్లో ముగ్గురు సైనిక సిబ్బంది ఉన్నారు. ప్యాసింజర్ విమానం పొటోమాక్ నదిలో కూలిపోయింది.ప్రమాదంలో ప్రాణాలతో బయటపడే అవకాశం లేనందున ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష