సింగపూర్లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం
- June 30, 2016
సింగపూర్లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. సౌత్ పరిశ్రమకు చెందిన సినీ తారలు ఈ వేడుకలో సందడి చేశారు. నిన్న జరిగిన కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్తో పాటు పలువురు భామలు తమ డ్యాన్సులతో అలరించారు. ఇక మెగా స్టార్ చిరంజీవికి సైమా గ్రాండ్ వెలకమ్ చెప్తూ, తన 150వ చిత్రానికి బెస్ట్ విషెస్ని అందించింది. అంతేకాదు చిరుని ఫెలిసిటేట్ చేయడానికి స్టేజ్పైకి ఇన్వయిట్ చేసింది సైమా. ఇక ఆ సమయంలో మన తెలుగు సినిమా నటీనటులంతా చిరుతో కలిసి సెల్ఫీ దిగేందుకు స్టేజ్పైకి పరుగులు తీశారు. చిరు కూడా వారితో కలిసి ఉత్సాహంగా సెల్ఫీ దిగారు. రానా, మంచు లక్ష్మీ, శిరీష్, అల్లు అరవింద్, కుష్బూ, సమంత, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సెల్ఫీలో పార్ట్ అయినందుకు తెగ సంతోషపడ్డారు. మొత్తానికి ఈ మెగా సెల్ఫీని చూసిన మెగాస్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







