సింగపూర్లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం
- June 30, 2016
సింగపూర్లో జూన్ 30, జూలై 1 తేదీలలో సైమా అవార్డుల కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. సౌత్ పరిశ్రమకు చెందిన సినీ తారలు ఈ వేడుకలో సందడి చేశారు. నిన్న జరిగిన కార్యక్రమంలో రకుల్ ప్రీత్ సింగ్తో పాటు పలువురు భామలు తమ డ్యాన్సులతో అలరించారు. ఇక మెగా స్టార్ చిరంజీవికి సైమా గ్రాండ్ వెలకమ్ చెప్తూ, తన 150వ చిత్రానికి బెస్ట్ విషెస్ని అందించింది. అంతేకాదు చిరుని ఫెలిసిటేట్ చేయడానికి స్టేజ్పైకి ఇన్వయిట్ చేసింది సైమా. ఇక ఆ సమయంలో మన తెలుగు సినిమా నటీనటులంతా చిరుతో కలిసి సెల్ఫీ దిగేందుకు స్టేజ్పైకి పరుగులు తీశారు. చిరు కూడా వారితో కలిసి ఉత్సాహంగా సెల్ఫీ దిగారు. రానా, మంచు లక్ష్మీ, శిరీష్, అల్లు అరవింద్, కుష్బూ, సమంత, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సెల్ఫీలో పార్ట్ అయినందుకు తెగ సంతోషపడ్డారు. మొత్తానికి ఈ మెగా సెల్ఫీని చూసిన మెగాస్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







