రియాద్ సీజన్ 2024.. రికార్డు స్థాయిలో 18 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- February 01, 2025
రియాద్: రియాద్ సీజన్ 2024కి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్లకు పైగా సందర్శకులు స్వాగతం పలికినట్లు జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. ఈ సీజన్ ఇంకా కొనసాగుతోందని, ప్రేక్షకులను ఆకట్టుకునేలా మరిన్ని ప్రపంచ స్థాయి ఈవెంట్లు, ప్రదర్శనలు జరుగుతాయని అల్-షేక్ తెలిపారు.
రియాద్ సీజన్ ఈ సంవత్సరం ఎడిషన్ వినోదం, టెక్నాలజీలో ప్రధాన గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అలాగే ఆర్ట్స్, క్రీడల ప్రపంచాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తుందన్నారు. రియాద్ సీజన్ పర్యాటకం, వినోద రంగాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ సీజన్ థియేట్రికల్, సంగీత ప్రదర్శనలు, ఎస్పోర్ట్స్ టోర్నమెంట్లు, అంతర్జాతీయ ఫుడ్ అనుభవాలు , థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఆకర్షణలతో సహా ప్రత్యేకమైన అనుభవాలను అందిస్తుందని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







