రియాద్ సీజన్ 2024.. రికార్డు స్థాయిలో 18 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- February 01, 2025
రియాద్: రియాద్ సీజన్ 2024కి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్లకు పైగా సందర్శకులు స్వాగతం పలికినట్లు జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఛైర్మన్ టర్కీ అల్-షేక్ ప్రకటించారు. ఈ సీజన్ ఇంకా కొనసాగుతోందని, ప్రేక్షకులను ఆకట్టుకునేలా మరిన్ని ప్రపంచ స్థాయి ఈవెంట్లు, ప్రదర్శనలు జరుగుతాయని అల్-షేక్ తెలిపారు.
రియాద్ సీజన్ ఈ సంవత్సరం ఎడిషన్ వినోదం, టెక్నాలజీలో ప్రధాన గ్లోబల్ కంపెనీల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. అలాగే ఆర్ట్స్, క్రీడల ప్రపంచాలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తుందన్నారు. రియాద్ సీజన్ పర్యాటకం, వినోద రంగాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ సీజన్ థియేట్రికల్, సంగీత ప్రదర్శనలు, ఎస్పోర్ట్స్ టోర్నమెంట్లు, అంతర్జాతీయ ఫుడ్ అనుభవాలు , థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఆకర్షణలతో సహా ప్రత్యేకమైన అనుభవాలను అందిస్తుందని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







