ఏడేళ్ల బాలుడు మిస్సింగ్..గంటలోపే తల్లిదండ్రులకు అప్పగింత..!!
- February 01, 2025
యూఏఈ: తప్పిపోయిన ఏడేళ్ల ఆసియా బాలుడిని గంటలోనే పోలీసులు వారి పేరెంట్స్ దగ్గరగా చేర్చారు. 7ఏళ్ల బాలుడు తప్పిపోగా, అజ్మాన్లోని ప్రధాన రహదారిపై ఒంటరిగా కనిపించాడు. వెంటనే పోలీసులు బాలుడిని తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదంతా గంటలోపే చకచకా జరిగిపోయింది. మనామా ప్రాంతంలో ఒంటరిగా ఉన్న బాలుడిని ఓ అరబ్ వ్యక్తి గుర్తించి, అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడని మనామా పోలీస్ సెంటర్ హెడ్ అడ్వకేట్ ముహమ్మద్ రషీద్ అల్ మత్రౌషి తెలిపారు. ఆ సమయంలో తప్పిపోయిన పిల్లల గురించి తమవద్ద ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని, బాలుడి కుటుంబాన్ని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసులు చిన్నారికి మధ్యాహ్న భోజనంతో పాటు కావాల్సినవన్నీ అందించారని పేర్కొన్నారు. నిమిషాల వ్యవధిలో అతని తల్లిదండ్రులను గుర్తించి సంప్రదించి, బాలుడిని అప్పగించినట్టు తెలిపారు. బాలుడిని గుర్తించడంలో సహాయంగా నిలిచిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయలో పోలీసుల చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.తమ పిల్లలపై ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలని పేరెంట్స్ కు అజ్మాన్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







