దుబాయ్ లో కత్తితో బెదిరించి 300,000 దిర్హాల దోపిడీ.. పాక్ వ్యక్తికి జైలుశిక్ష..!!

- February 01, 2025 , by Maagulf
దుబాయ్ లో కత్తితో బెదిరించి 300,000 దిర్హాల దోపిడీ.. పాక్ వ్యక్తికి జైలుశిక్ష..!!

దుబాయ్: 2024లో ఇద్దరు భారత నివాసితులను కత్తితో బెదిరించి దోచుకున్నందుకు ఒక పాకిస్థాన్ వ్యక్తికి ఒక సంవత్సరం జైలుశిక్ష విధించారు.  అతను Dh300,000 లకు పైగా జరిమానా చెల్లించాలని ఆదేశించారు.అతని జైలు శిక్ష తర్వాత బహిష్కరించాలని దుబాయ్ కోర్టు తీర్పులో ఆదేశించింది. 

ఏప్రిల్ 2024లో ఈ సంఘటన జరిగినప్పుడు, బాధితులు Dh296,300 విలువైన 100 మొబైల్ ఫోన్‌లు మరియు 10,000 Dh10,000 విలువైన 62 వాచ్‌లను కలిగి ఉన్న ఏడు పెట్టెలను తీసుకువెళుతున్నారని కోర్టు రికార్డులు తెలిపాయి.  నిందితుడు, 28 ఏళ్ల పాకిస్తానీ వ్యక్తి అని, తన అనుచరులతో దుబాయ్‌లోని అల్ మురఖబాత్ ప్రాంతంలో ఇద్దరు నివాసితులను కత్తితో బెదిరించి చోరీకి పాల్పడ్డాని పేర్కొన్నారు.  ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన వస్తువులతో కూడిన బాక్సులను ముఠా దొంగిలించింది. ఈ ఉత్పత్తులలో హై-ఎండ్ శామ్‌సంగ్, ఐఫోన్ మొబైల్ ఫోన్‌లు, లగ్జరీ వాచీలు ఉన్నాయి. బాక్సులతో పాటు బాధితుల వ్యక్తిగత వస్తువులను కూడా నిందితులు దోచుకున్నారు.

మొదటి బాధితుడు అయిన భారతీయ జాతీయుడి నుండి శామ్సంగ్ అల్ట్రా S22 మొబైల్ ఫోన్, ఒక ఎమిరేట్స్ ID, దుబాయ్ లో జారీ చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్, మూడు బ్యాంక్ కార్డులు, ఒక కారు కీ, Dh17,400 నగదును నిందితులు దొంగిలించారు. అలాగే, రెండవ బాధితుడు అయిన మరో భారతీయ జాతీయుడి వద్ద నుండి ఎమిరేట్స్ ID, డ్రైవింగ్ లైసెన్స్, 40 దిర్హామ్ నగదు, హానర్ 98 ఫోన్‌తో కూడిన నీలిరంగు నైక్ వాలెట్‌ను దొంగిలించారు. ఈ మొత్తం వస్తువులతో ముఠా పారిపోయింది. దుబాయ్ పోలీసులు నిందితుడిని ట్రాక్ చేయగా, అతని సహచరులు పరారీలో ఉన్నారు. నిందితుడు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ముందు తనఫై వచ్చిన ఆరోపణలను తిరస్కరించాడు. కానీ అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి అతడిని నిందితుడిగా కోర్టు తేల్చి, తీర్పునిచ్చింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com