మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం..
- February 01, 2025
హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.వివిధ శాఖలకు అవసరమైన బడ్జెట్, నిధుల సర్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.అలాగే కేంద్ర బడ్జెట్ తో తెలంగాణకు కలిగే లాభనష్టాలపైనా అధ్యయనం చేసింది మంత్రివర్గం.వీటితో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనకు సమాలోచనలు చేశారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదనే భావన..
మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం సుదీర్ఘంగా సాగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఆరున్నర గంటల పాటు ఈ సమీక్ష సమావేశం జరిగింది.ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కలేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కలిగే ప్రయోజనమేంటి, నష్టమేంటి అన్నదానిపై..రంగాల వారీగా సుదీర్ఘంగా ఈ మీటింగ్ లో చర్చించారు.
రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సమాలోచనలు..
వివిధ శాఖలకు, రంగాలకు బడ్జెట్ అవసరాలు, నిధుల సర్దుబాటుకు సంబంధించిన అంశాలపైన చర్చ జరిగింది.దీంతో పాటు త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన పైనా సమాలోచనలు మంత్రుల సమావేశం జరిగింది.కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు దక్కలేదన్నది ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







