యాన్బు స్టీమ్ టర్బైన్ యూనిట్లో ప్రమాదం..అనేకమంది కార్మికులు మృతి..!!
- February 03, 2025
రియాద్: యాన్బు ఇండస్ట్రియల్ సిటీలోని మరాఫిక్ కంపెనీకి చెందిన స్టీమ్ టర్బైన్ యూనిట్ బాయిలర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ దుర్ఘటనలో అనేకమంది కార్మికులు మరణించగా, పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ కథనం ప్రకారం..మరాఫిక్ కంపెనీ ఆవిరి టర్బైన్ యూనిట్లోని ఆరవ యూనిట్ బాయిలర్కు మద్దతు ఇచ్చే యూనిట్లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో వార్షిక పీరియాడిక్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం యూనిట్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు కంపెనీ తెలిపింది. మంటలు సకాలంలో పూర్తిగా అదుపులోకి వచ్చాయని,ఈ ప్రమాదంలో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ నియమించిన అనేక మంది కార్మికులు మరణించారని తెలిపింది.కాగా, అగ్నిప్రమాదం వల్ల వినియోగదారులకు అందించే సేవలు ప్రభావితం కాలేదని పేర్కొంది.ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి సంబంధిత అధికారులతో కంపెనీ సమన్వయంతో పని చేస్తోందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







