యాన్బు స్టీమ్ టర్బైన్ యూనిట్లో ప్రమాదం..అనేకమంది కార్మికులు మృతి..!!
- February 03, 2025
రియాద్: యాన్బు ఇండస్ట్రియల్ సిటీలోని మరాఫిక్ కంపెనీకి చెందిన స్టీమ్ టర్బైన్ యూనిట్ బాయిలర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ దుర్ఘటనలో అనేకమంది కార్మికులు మరణించగా, పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ కథనం ప్రకారం..మరాఫిక్ కంపెనీ ఆవిరి టర్బైన్ యూనిట్లోని ఆరవ యూనిట్ బాయిలర్కు మద్దతు ఇచ్చే యూనిట్లో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో వార్షిక పీరియాడిక్ మెయింటెనెన్స్ పనుల నిమిత్తం యూనిట్ కార్యకలాపాలను నిలిపివేసినట్టు కంపెనీ తెలిపింది. మంటలు సకాలంలో పూర్తిగా అదుపులోకి వచ్చాయని,ఈ ప్రమాదంలో మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ నియమించిన అనేక మంది కార్మికులు మరణించారని తెలిపింది.కాగా, అగ్నిప్రమాదం వల్ల వినియోగదారులకు అందించే సేవలు ప్రభావితం కాలేదని పేర్కొంది.ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి సంబంధిత అధికారులతో కంపెనీ సమన్వయంతో పని చేస్తోందని ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







