యూఏఈలో కొత్త బీమా నిబంధనలు..ఫిబ్రవరి 15 నుండి డైరెక్ట్ పేమెంట్స్..!!
- February 03, 2025
యూఏఈ: ఫిబ్రవరి 15 నుండి యూఏఈలో కొత్త బీమా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై బ్రోకర్ల ద్వారా వెళ్లకుండా నేరుగా బీమా సంస్థలకు చెల్లింపులు చేయవచ్చు.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యూఏఈ(CBUAE) నిబంధనల ప్రకారం.. బ్రోకర్లు గతంలో సాధారణ బీమా ప్రీమియంలను బీమా సంస్థకు చెల్లించే ముందు సేకరించడానికి అనుమతించారు. దీనికారణంగా వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ అవుతుందనిhttp://Insurancemarket.ae సీఈఓ అవినాష్ బాబర్ తెలిపారు. క్లెయిమ్ చెల్లింపులు మరియు ప్రీమియం వాపసులను బీమా సంస్థల నుండి నేరుగా ఖాతాదారులకు చేయాలని Policybazaar.ae బిజినెస్ హెడ్ తోషితా చౌహాన్ తెలిపారు. ఇవి వెబ్ పోలిక పోర్టల్స్, ఇతర థర్డ్ పార్టీల ద్వారా బ్రోకర్ల ద్వారా వచ్చే బీమా అమ్మకాలపై కూడా ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ మార్పు ప్రీమియం వసూళ్లను నిర్వహించడంలో ఆర్థిక ప్రమాదాన్ని తొలగిస్తుందని, బ్రోకర్లు అడ్మినిస్ట్రేటివ్ పేమెంట్ మేనేజ్మెంట్ కంటే అడ్వైజరీ, క్లయింట్ సేవపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని బాబర్ తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







