యూఏఈలో కొత్త బీమా నిబంధనలు..ఫిబ్రవరి 15 నుండి డైరెక్ట్ పేమెంట్స్..!!
- February 03, 2025
యూఏఈ: ఫిబ్రవరి 15 నుండి యూఏఈలో కొత్త బీమా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై బ్రోకర్ల ద్వారా వెళ్లకుండా నేరుగా బీమా సంస్థలకు చెల్లింపులు చేయవచ్చు.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది యూఏఈ(CBUAE) నిబంధనల ప్రకారం.. బ్రోకర్లు గతంలో సాధారణ బీమా ప్రీమియంలను బీమా సంస్థకు చెల్లించే ముందు సేకరించడానికి అనుమతించారు. దీనికారణంగా వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్ అవుతుందనిhttp://Insurancemarket.ae సీఈఓ అవినాష్ బాబర్ తెలిపారు. క్లెయిమ్ చెల్లింపులు మరియు ప్రీమియం వాపసులను బీమా సంస్థల నుండి నేరుగా ఖాతాదారులకు చేయాలని Policybazaar.ae బిజినెస్ హెడ్ తోషితా చౌహాన్ తెలిపారు. ఇవి వెబ్ పోలిక పోర్టల్స్, ఇతర థర్డ్ పార్టీల ద్వారా బ్రోకర్ల ద్వారా వచ్చే బీమా అమ్మకాలపై కూడా ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ మార్పు ప్రీమియం వసూళ్లను నిర్వహించడంలో ఆర్థిక ప్రమాదాన్ని తొలగిస్తుందని, బ్రోకర్లు అడ్మినిస్ట్రేటివ్ పేమెంట్ మేనేజ్మెంట్ కంటే అడ్వైజరీ, క్లయింట్ సేవపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుందని బాబర్ తెలిపారు.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









