బహ్రెయిన్ లో సోషల్ మీడియా స్కామ్..ముగ్గురు ఆసియన్లు అరెస్ట్..!!
- February 04, 2025
మనామా: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మహిళను మోసం చేసినందుకు ముగ్గురు ఆసియా జాతీయులను అరెస్టు చేసినట్లు ముహర్రాక్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ ప్రకటించింది. నిందితులు మొబైల్ ఫోన్ను విక్రయించడానికి మోసపూరిత ఆన్లైన్ ప్రకటనను ఉపయోగించారని ఆరోపించారు. పోలీసు నివేదికల ప్రకారం.. బాధితురాలు మొబైల్ ఫోన్ కోసం ఆన్లైన్ ప్రకటనను చూసిన తర్వాత నిందితులలో ఒకరిని సంప్రదించింది. పూర్తి ధర ఆమె పూర్తి ధరను ముందుగానే చెల్లించింది. పరికరాన్ని స్వీకరించిన తర్వాత, అది పనిచేయడం లేదని, ముందుగా చెప్పిన స్పెసిఫికేషన్లు లేవని గుర్తించింది. విక్రేతలను సంప్రదించేందుకు ప్రయత్నించగా తన నంబర్ ను బ్లాక్ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన అనంతరం బాధితురాలు సమహీజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







