దమ్మామ్లో 11 మిలియన్లకు పైగా డ్రగ్ పిల్స్..ఇద్దరు అరెస్ట్..
- February 06, 2025
రియాద్: తూర్పు ప్రావిన్స్లోని దమ్మామ్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్ట్ వద్ద 11 మిలియన్లకు పైగా డ్రగ్స్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ విఫలం చేసింది.ఈ కేసులో ఒక సౌదీ పౌరుడితోపాటు జోర్డాన్ నివాసిని అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ ప్రకారం.. ఓడరేవుకు చేరుకున్న ఆహార సామాగ్రి రవాణాలో మొత్తం 11,108,998 యాంఫెటమైన్ మాత్రలు దాచి పెట్టినట్టు తనిఖీల సందర్భంగా గుర్తించారు. డైరెక్టరేట్ జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ సహకారంతో చేపట్టిన భద్రతా ఆపరేషన్లో డ్రగ్స్ను, దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో 911 మరియు సౌదీలోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్లకు కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా ట్రాఫికింగ్కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల సమాచారాన్ని తెలియజేయాలని భద్రతా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







