దమ్మామ్లో 11 మిలియన్లకు పైగా డ్రగ్ పిల్స్..ఇద్దరు అరెస్ట్..
- February 06, 2025
రియాద్: తూర్పు ప్రావిన్స్లోని దమ్మామ్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్ట్ వద్ద 11 మిలియన్లకు పైగా డ్రగ్స్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ విఫలం చేసింది.ఈ కేసులో ఒక సౌదీ పౌరుడితోపాటు జోర్డాన్ నివాసిని అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ ప్రకారం.. ఓడరేవుకు చేరుకున్న ఆహార సామాగ్రి రవాణాలో మొత్తం 11,108,998 యాంఫెటమైన్ మాత్రలు దాచి పెట్టినట్టు తనిఖీల సందర్భంగా గుర్తించారు. డైరెక్టరేట్ జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ సహకారంతో చేపట్టిన భద్రతా ఆపరేషన్లో డ్రగ్స్ను, దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో 911 మరియు సౌదీలోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్లకు కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా ట్రాఫికింగ్కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల సమాచారాన్ని తెలియజేయాలని భద్రతా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







