దమ్మామ్లో 11 మిలియన్లకు పైగా డ్రగ్ పిల్స్..ఇద్దరు అరెస్ట్..
- February 06, 2025
రియాద్: తూర్పు ప్రావిన్స్లోని దమ్మామ్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్ట్ వద్ద 11 మిలియన్లకు పైగా డ్రగ్స్ మాత్రలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ విఫలం చేసింది.ఈ కేసులో ఒక సౌదీ పౌరుడితోపాటు జోర్డాన్ నివాసిని అరెస్ట్ చేశారు. డైరెక్టరేట్ ప్రకారం.. ఓడరేవుకు చేరుకున్న ఆహార సామాగ్రి రవాణాలో మొత్తం 11,108,998 యాంఫెటమైన్ మాత్రలు దాచి పెట్టినట్టు తనిఖీల సందర్భంగా గుర్తించారు. డైరెక్టరేట్ జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ సహకారంతో చేపట్టిన భద్రతా ఆపరేషన్లో డ్రగ్స్ను, దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లోని ప్రాంతాలలో 911 మరియు సౌదీలోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్లకు కాల్ చేయడం ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ లేదా ట్రాఫికింగ్కు సంబంధించిన ఏదైనా కార్యకలాపాల సమాచారాన్ని తెలియజేయాలని భద్రతా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









