రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఇఫ్తార్ విందు
- July 01, 2016
పవిత్ర రమదాన్ మాసం పురస్కరించుకుని రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఆర్ధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు. తెలుగు తరంగిణి కార్య నిర్వాహక సభ్యులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో రస్ అల్ ఖైమా లేబర్ కాంప్ లో ఉపవాస దీక్ష చేస్తున్న సుమారు 200 మందికి విందు భోజనం, పళ్ళు, స్వీట్స్ మరియు ఖర్జూరం తెలుగు తరంగిణి చిన్నపిల్లల చేతుల మీదుగ పంచిపెట్టారు.
కార్యక్రమానంతరం తెలుగు తరంగిణి అధ్యక్షులు శ్రీ వక్కలగడ్డ వెంకట సురేష్, కార్య నిర్వాహక సభ్యులు శ్రీ సులేమాన్ మట్లాడుతూ రమదాన్ మాసం చిన్న పిల్లలకు సేవా, క్రమశిక్షణ, నిష్ట, దాతృత్వం, ధార్మిక చింతనల ఆవస్యకతలను తెలియచేస్తుంది కనుక పిల్లల చేతుల మీదుగా విందు పంపిణీ చేయటం జరిగింది అని తెలిపారు. ఈసందర్భంగా సభ్యులు తెలుగు తరంగిణి తరఫున అందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలియచేసారు.




తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







