రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఇఫ్తార్ విందు

- July 01, 2016 , by Maagulf

పవిత్ర రమదాన్  మాసం పురస్కరించుకుని రస్ అల్ ఖైమా నగరంలో తెలుగు తరంగిణి ఆర్ధ్వర్యంలో  ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు. తెలుగు తరంగిణి కార్య నిర్వాహక సభ్యులు మరియు ఇతర సభ్యుల సమక్షంలో రస్ అల్ ఖైమా లేబర్ కాంప్ లో ఉపవాస దీక్ష చేస్తున్న సుమారు 200 మందికి విందు భోజనం, పళ్ళు, స్వీట్స్ మరియు ఖర్జూరం తెలుగు తరంగిణి చిన్నపిల్లల చేతుల మీదుగ పంచిపెట్టారు.

 

కార్యక్రమానంతరం తెలుగు తరంగిణి అధ్యక్షులు శ్రీ  వక్కలగడ్డ వెంకట  సురేష్,  కార్య నిర్వాహక సభ్యులు శ్రీ  సులేమాన్  మట్లాడుతూ రమదాన్ మాసం చిన్న పిల్లలకు సేవా, క్రమశిక్షణ, నిష్ట, దాతృత్వం, ధార్మిక చింతనల ఆవస్యకతలను తెలియచేస్తుంది  కనుక పిల్లల చేతుల మీదుగా విందు పంపిణీ చేయటం జరిగింది అని తెలిపారు. ఈసందర్భంగా సభ్యులు తెలుగు తరంగిణి తరఫున అందరికీ ఈద్ శుభాకాంక్షలు  తెలియచేసారు.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com