ఫిబ్రవరి 23న Dh1 మిలియన్ హోప్ మేకర్ బహుమతి ప్రదానం..!!
- February 09, 2025
దుబాయ్: హోప్ మేకర్స్ 1 మిలియన్ దిర్హామ్ అవార్డు ఐదవ ఎడిషన్లో 26,000 మందికి పైగా యువకులు, మహిళలు పాల్గొన్నారని దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. హోప్ మేకర్స్ అవార్డు విజేతల మానవతా.. ఇతరులకు సహాయం చేయడానికి ఉద్దేశించిన వారి కార్యక్రమాలను మరింత అభివృద్ధి చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. "ఆశను కలిగించడం అంటే జీవితాన్ని నిర్మించడం అని జీవితం నాకు నేర్పింది. ఆశ అనేది మనం జీవించే వాస్తవికతను మనం కోరుకునే భవిష్యత్తుతో అనుసంధానించే బ్రిడ్జీ. నిరాశ వారిని నియంత్రించకుండా లక్షలాది మంది యువతకు వంతెనలు నిర్మించడానికి మనం దోహదపడాలి. ఎందుకంటే ఆశను నమ్మడం అంటే జీవితాన్ని నమ్మడం" అని యూఏఈ ఉపాధ్యక్షుడు,ప్రధాన మంత్రి కూడా అయిన షేక్ మొహమ్మద్ అన్నారు.
గత విజేతలు
2017లో200,000 కంటే ఎక్కువ మంది శరణార్థుల ప్రాణాలను కాపాడడంలో సహాయపడిన మొరాకోకు చెందిన నవాల్ అల్ సౌఫీకి అరబ్ హోప్ మేకర్ అవార్డు లభించింది. కైరో వీధుల్లో నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయం కల్పించినందుకు ఈజిప్టుకు చెందిన మహమూద్ వాహిద్కు 2018లో అరబ్ హోప్ మేకర్ అవార్డు లభించింది. 2020లో విజేత ఎమిరాటీ అహ్మద్ అల్ ఫలాసి, కెన్యాలోని మొంబాసాలో అధునాతన కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు మరియు ఇంక్యుబేటర్లను స్థాపించడంలో తన మిషన్కు అవార్డు గెలుచుకున్నాడు. 2024లో క్యాన్సర్తో బాధపడుతున్న వందలాది మంది యువకులను, దృఢ సంకల్పం ఉన్న పిల్లలను చూసుకునే ఇరాకీ ఫార్మసిస్ట్ తాలా అల్ ఖలీల్ ప్రతిష్టాత్మక అవార్డు విజేతగా నిలిచారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







