హాఫ్ డెసర్ట్..గంటకు Dh300కి పెరిగిన క్యాంపింగ్ ఫీజు..!!
- February 09, 2025
దుబాయ్: అల్ ఐన్ రోడ్, ఎమిరేట్స్ రోడ్ సర్కిల్లో ఉన్న హాఫ్ డెసర్ట్, ప్రశాంతమైన ఎడారి బార్బెక్యూను ఆస్వాదించాలనుకునే నివాసితులకు చాలా కాలంగా ఇష్టమైన శీతాకాల విహారయాత్రగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో వందలాది టెంట్లు ఏర్పాటవుతాయి. సందర్శకులు విశ్రాంతి తీసుకోవడానికి, వంట చేయడానికి, ఓపెన్ ఆకాశం కింద చల్లటి సాయంత్రాన్ని ఆస్వాదించేందుకు ఇది ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ సీజన్లో అద్దె ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది చాలా మంది సందర్శకులను ఆశ్చర్యపరిచింది, అదే సమయలో నిరాశపరిచింది.
ఇరానియన్ ప్రవాసియైన జావాద్ జాఫారి గత డిసెంబర్లో మ్యూజిక్ సిస్టమ్, గ్రిల్ తో కూడిన సెటప్ కోసం గంటకు Dh100 మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. ఇప్పుడు పెరిగిన ధరలను చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు. "నేను అదే టెంట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ధర గంటకు Dh300కి పెరిగిందని విని షాక్ అయ్యాను." అని వివరించాడు. సైట్లోని టెంట్ల ధరల పెరుగుదలకు పెరుగుతున్న డిమాండ్ కారణమని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అనేక టెంట్లను నిర్వహించే అబ్దుల్ రహీమ్ అక్తర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ధర మొదట గంటకు Dh300గా నిర్ణయించామన్నారు. అయితే, అక్టోబర్ నవంబర్లలో తక్కువ మంది సందర్శకులు వస్తారని, ఆసమయంలో డిస్కౌంట్లను అందించామని అక్తర్ అన్నారు. అయితే, జనవరిలో శీతాకాలం సమయంలో అధిక డిమాండ్ ఉంటుందని తెలిపాడు.ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, చాలా మంది నివాసితులు హాఫ్ డెసర్ట్ అందించే ప్రత్యేకమైన అనుభవం కోసం తరలివస్తున్నారు.
తాజా వార్తలు
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం







