ప్రయాణికుడి పొరబాటుతో 25,000 దిర్హామ్ల నగదు బ్యాగ్ మిస్..!!
- February 10, 2025
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 25,000 దిర్హామ్లకు పైగా నగదు ఉన్న ప్రయాణికుడి పోగొట్టుకున్న బ్యాగ్ను దుబాయ్ పోలీసులు వెంటనే ట్రాక్ చేసి తిరిగి అందించారని అథారిటీ తెలిపింది. మునీర్ సయీద్ ఇబ్రహీం అనే ఈజిప్షియన్ యాత్రికుడు పొరపాటున మరొక ప్రయాణికుడు తన బ్యాగ్ మాదిరగానే ఉన్న మరో ప్రయాణికుడి బ్యాగును కన్వేయర్ బెల్ట్ వద్ద నుండి తీసుకెళ్ళాడు.అయితే, అందులో ఉండాల్సిన ప్రయాణ పత్రాలతో పాటు $7,000 (సుమారు 25,710.30 దిర్హామ్లు) నగదు కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. జరిగిన పొరబాటును గుర్తించాడు. వెంటనే పోలీసులను కలిసి జరిగిన పొరబాటును వివరించాడు. దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అరగంటలో అతని బ్యాగుని ట్రాక్ చేసి తిరిగి ఇచ్చిందని పోలీసులు తెలిపారు.
కేవలం ఒక గంటలో చైనాకు మరో విమానాన్ని పట్టుకోవాలనే హడావిడిలో మునీర్ తన బ్యాగును పోలిఉన్న మరో బ్యాగును తీసుకున్నాడని, వెంటనే పొరబాటును గ్రహించి అరైవల్ హాల్లోని విమానాశ్రయ పోలీసు కార్యాలయానికి వెళ్లడంతో అతనికి వెంటనే న్యాయం చేసేందుకు వీలయిందని తెలిపారు. ఆ తర్వాత మునీర్ చైనాకు వెళ్లే విమానాన్ని పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దుబాయ్ పోలీసు అధికారులు, సిబ్బంది చేసిన కృషికి.. వారు వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించినందుకు ప్రయాణీకులు అభినందించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







