ఖతార్ నుండి రెడ్డి శ్రీనివాస్ మృతదేహం స్వదేశానికి తరలింపు

- July 10, 2015 , by Maagulf
ఖతార్ నుండి రెడ్డి శ్రీనివాస్ మృతదేహం స్వదేశానికి తరలింపు

ఇటీవల ఖతార్ లో అగ్ని ప్రమాదంలో చనిపోయిన శ్రీ రెడ్డి శ్రీనివాస్ మృతదేహం 10 జులై 2015 రాత్రి గం. 08:20 ని. లకు ఖతార్ ఎయిర్ వేస్ ఫ్లయిట్ నెం. QR-500 ద్వారా ఇండియాకు పంపిస్తున్నారు. 11 జులై 2015 న ఉ. గం 02:50 ని. లకు  శవ పేటిక హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు చేరుకుంటుంది. తమ స్వగ్రామం పెంటపాడు (పశ్చిమ గోదావరి జిల్లా) వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యం కల్పించాలని మృతుని కుటుంబ సభ్యులు ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

శవాన్ని స్వదేశానికి తెప్పించుటకు తాడేపల్లి గూడెం కు చెందిన ప్రముఖ సంఘ సేవకులు శ్రీ గట్టిం మాణిక్యాల రావు (సెల్: +91 98480 79579) గారు కృషి చేశారు.  

 

'మా గల్ఫ్' ప్రతినిధి, హైదరాబాద్ 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com