గ్లోబల్ హబ్గా ఖతార్..మరో అంతర్జాతీయ సమావేశానికి హోస్ట్..!!
- February 11, 2025
దోహా: ఖతార్ టూరిజం.. 51వ UN టూరిజం రీజినల్ కమిషన్ ఫర్ మిడిల్ ఈస్ట్కు ఫిబ్రవరి 12న దోహాలో హోస్ట్ చేయనుంది. ఈ సమావేశంలో ఈ ప్రాంతంలోని వివిధ దేశాలకు చెందిన పర్యాటక మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులతో పాటు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్ టూరిజం) అధికారులు పాల్గొంటారు. దోహాను హోస్ట్ సిటీగా ఎంపిక చేయడం, పర్యాటక రంగంలో ప్రాంతీయ, గ్లోబల్ హబ్గా ఖతార్ అభివృద్ధి చెందుతున్న స్థితిని తెలియజేస్తుందని అధికారులు తెలిపారు. ప్రధాన గ్లోబల్ ఈవెంట్లకు ఖతార్ కేరాఫ్ గా మారుతుందన్నారు. ముఖ్యంగా FIFA వరల్డ్ కప్ 2022ని హోస్ట్ చేయడంతో ఖతార్ కు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిందని ఖతార్ టూరిజం చైర్మన్, విజిట్ కతార్ డైరెక్టర్ల బోర్డు చైర్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖర్జీ తెలిపారు. ఈ సమావేశంలో UN టూరిజం 2024-2025 కాలానికి సంబంధించి పనితీరుపై నివేదికలను అందజేస్తుంది. భవిష్యత్తు విధానాలు, ప్రణాళికలపై చర్చిస్తారు.
"స్పోర్ట్స్ టూరిజం, టూరిజం ఇండస్ట్రీ పోస్ట్-వరల్డ్ కప్" పేరుతో ఫిబ్రవరి 13న షెరటన్ గ్రాండ్ దోహా రిసార్ట్ & కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. ఈ ఈవెంట్ ద్వారా స్పోర్ట్స్ టూరిజం అనుభవాన్ని పెంపొందుతుందని పేర్కొన్నారు. ఖతార్ టూరిజం ఖతార్ జాతీయ విజన్ 2030కి అనుగుణంగా వైవిధ్యభరితమైన టూరిజం ఆఫర్లు, సందర్శకుల అనుభవాలను పెంపొందించడం, ఖతార్ను ఒక ప్రముఖ గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా స్థాపించడానికి తన ప్రతిష్టాత్మక వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







