ప్రధాని మోడీ విమానం పై ఉగ్రదాడి చేస్తాం...ముంబై పోలీస్ లకు కాల్
- February 12, 2025
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించే విమానంపై ఉగ్రదాడి జరగవచ్చని పోలీసులకు వార్నింగ్ నోట్ రావడం కలకలం రేపింది. ప్రధాని మోదీ ఇవాళ, రేపు అమెరికాలో పర్యటించనున్నారు. ఇటువంటి సమయంలో మోదీ విమానానికి బెదిరింపులు రావడం గమనార్హం. ఈ బెదిరింపు నోట్పై ముంబై పోలీసులు ఓ ప్రకటన చేశారు.
మోదీ విదేశాల్లో అధికారిక పర్యటన చేయనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు బెదిరింపు కాల్ వచ్చిందని, మోదీ విమానంపై దాడి చేస్తామని అన్నారని అధికారులు తెలిపారు. దీనిపై ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని, దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని చెంబూర్ ప్రాంతం నుంచి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు.
కాగా, ప్రధాని మోదీ నాలుగు రోజుల ఫ్రాన్స్, అమెరికా పర్యటనను సోమవారం ప్రారంభమైంది. ఇవాళ మోదీ పారిస్ పర్యటన అనంతరం అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లనున్నారు.
ఇప్పటికే మోదీ పారిస్లో జరిగే ఏఐ సదస్సులో పాల్గొన్నారు. అమెరికాలో మోదీ రెండు రోజులపాటు పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారని ఇప్పటికే వైట్హౌస్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. రేపు డొనాల్డ్ ట్రంప్తో మోదీ సమావేశం అవుతారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై టారిఫ్లు విధిస్తున్నారు. ఈ సమయంలో మోదీ యూఎస్ వెళ్తుండడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









