రమదాన్ తనిఖీలలో 15 మందికి హెచ్చరికలు, 5 గురికి నోటీసులు
- July 10, 2015
రమదాన్ పండుగను పురస్కరించుకుని అబుధాబీ మరియు అల్ ఆయీన్ లలో ఏర్పాటు చేసిన 24 రమదాన్ టెంట్లు మరియు 59 ప్రమోషనల్ కియోస్క్లలో అబుధాబీ ఫుడ్ అండ్ కంట్రోల్ అథారిటీ వారి హోటెల్ అండ్ ఇవెంట్స్ కంట్రోల్ యూనిట్ వారు ఆహారపదార్ధాల తయారీ, వండడం, ప్రదర్శించడం వంటి అంశాలలో సాధారణంగా జరిగే నిబంధనల ఆతిక్రమణ లక్ష్యంగా రెండు వారాల పాటు తనిఖీలు జరిపి, 15 మందికి హెచ్చరికలు, 5 గురికి నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా కమ్మూనికేషన్ అండ్ కమ్మ్యూనిటీ సర్వీస్ డివిజన్ డైరక్టర్ జనరల్ - మొహమ్మద్ జలాల్ అల్ రైసీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తున్న వీటి సంఖ్యను గమనించినట్లైతే, తాము సరైన దిశలోనే ఉన్నామని తెలుస్తోందని, వినియోగదారులను తాము భాగస్తులుగా భావిస్తామని, ఈ ప్రదేశాలలో ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించినట్లైతే తమకు తెలియజేయవలసినదని, ఇందుకు గాను 800555 నెంబరుకు ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కేవలం రమదాన్ నెలలో మాత్రమే కాకుండా, తనిఖీలు సంవత్సరమంతా కొనసాగుతాయని ఆయన తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









