రమదాన్ తనిఖీలలో 15 మందికి హెచ్చరికలు, 5 గురికి నోటీసులు
- July 10, 2015
రమదాన్ పండుగను పురస్కరించుకుని అబుధాబీ మరియు అల్ ఆయీన్ లలో ఏర్పాటు చేసిన 24 రమదాన్ టెంట్లు మరియు 59 ప్రమోషనల్ కియోస్క్లలో అబుధాబీ ఫుడ్ అండ్ కంట్రోల్ అథారిటీ వారి హోటెల్ అండ్ ఇవెంట్స్ కంట్రోల్ యూనిట్ వారు ఆహారపదార్ధాల తయారీ, వండడం, ప్రదర్శించడం వంటి అంశాలలో సాధారణంగా జరిగే నిబంధనల ఆతిక్రమణ లక్ష్యంగా రెండు వారాల పాటు తనిఖీలు జరిపి, 15 మందికి హెచ్చరికలు, 5 గురికి నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా కమ్మూనికేషన్ అండ్ కమ్మ్యూనిటీ సర్వీస్ డివిజన్ డైరక్టర్ జనరల్ - మొహమ్మద్ జలాల్ అల్ రైసీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తున్న వీటి సంఖ్యను గమనించినట్లైతే, తాము సరైన దిశలోనే ఉన్నామని తెలుస్తోందని, వినియోగదారులను తాము భాగస్తులుగా భావిస్తామని, ఈ ప్రదేశాలలో ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించినట్లైతే తమకు తెలియజేయవలసినదని, ఇందుకు గాను 800555 నెంబరుకు ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కేవలం రమదాన్ నెలలో మాత్రమే కాకుండా, తనిఖీలు సంవత్సరమంతా కొనసాగుతాయని ఆయన తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







