రమదాన్ తనిఖీలలో 15 మందికి హెచ్చరికలు, 5 గురికి నోటీసులు

- July 10, 2015 , by Maagulf
రమదాన్ తనిఖీలలో 15 మందికి హెచ్చరికలు, 5 గురికి నోటీసులు

రమదాన్ పండుగను పురస్కరించుకుని అబుధాబీ మరియు అల్ ఆయీన్ లలో ఏర్పాటు చేసిన 24 రమదాన్ టెంట్లు మరియు 59 ప్రమోషనల్ కియోస్క్‌లలో అబుధాబీ ఫుడ్ అండ్ కంట్రోల్ అథారిటీ వారి హోటెల్ అండ్ ఇవెంట్స్ కంట్రోల్ యూనిట్ వారు ఆహారపదార్ధాల తయారీ, వండడం, ప్రదర్శించడం వంటి అంశాలలో సాధారణంగా జరిగే నిబంధనల ఆతిక్రమణ లక్ష్యంగా  రెండు వారాల పాటు తనిఖీలు జరిపి, 15 మందికి హెచ్చరికలు, 5 గురికి నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా కమ్మూనికేషన్ అండ్ కమ్మ్యూనిటీ సర్వీస్ డివిజన్ డైరక్టర్ జనరల్ - మొహమ్మద్ జలాల్ అల్ రైసీ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తున్న వీటి సంఖ్యను గమనించినట్లైతే, తాము సరైన దిశలోనే ఉన్నామని తెలుస్తోందని, వినియోగదారులను తాము భాగస్తులుగా భావిస్తామని, ఈ ప్రదేశాలలో ఎక్కడైనా నిబంధనలు అతిక్రమించినట్లైతే తమకు తెలియజేయవలసినదని, ఇందుకు గాను 800555 నెంబరుకు ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కేవలం రమదాన్ నెలలో మాత్రమే కాకుండా, తనిఖీలు సంవత్సరమంతా కొనసాగుతాయని ఆయన తెలియజేశారు.

 

--సి.శ్రీ(దుబాయ్) 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com