ఛాంపియన్స్ ట్రోఫీ.. E311, హెస్సా స్ట్రీట్లో భారీగా ట్రాఫిక్ జామ్..!!
- February 21, 2025
యూఏఈ: దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు ప్రారంభం అయ్యాయి.దీని కారణంగా ఎమిరేట్లోని రెండు ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు గంటలకొద్ది ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బంధులు ఎదుర్కొన్నారు.
షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్.హెస్సా స్ట్రీట్ రెండింటిలోనూ ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 9 నుండి 11 గంటల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది.వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని,ఈవెంట్ సమయంలో సాఫీగా వెళ్లేందుకు ముందుగానే బయలుదేరాలని అధికార యంత్రాంగం సూచించింది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇండియా మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడానికి దుబాయ్ని తటస్థ వేదికగా నిర్ధారించిన విషయం తెలిసిందే.దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మూడు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 20న ఇండియా vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న ఇండియా vs పాకిస్తాన్, మార్చి 2న ఇండియా vs న్యూజిలాండ్ జరుగనున్నాయి.మార్చి 4న తొలి సెమీఫైనల్కు, భారత్ పెద్ద మ్యాచ్కు అర్హత సాధిస్తే మార్చి 9న ఫైనల్కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.టైటిల్ డిసైడర్కు భారత్ అర్హత సాధించకపోతే, లాహోర్ రెండో సెమీఫైనల్ మరియు ఫైనల్కు ఆతిథ్యం ఇస్తుంది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కు ముందు విమాన ఛార్జీలు పెరిగాయి. ప్రయాణ నిపుణులు బుకింగ్లు, విమాన ఛార్జీలు 20-50 శాతం మధ్య పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. చివరి నిమిషంలో ఛార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







