దుబాయ్ లోని జుమేర లో బంగారం దొంగలించిన ఫిలిప్పీన్స్ మహిళ
- July 03, 2016
64 కళల్లో చోర కళ కూడా ఒకటి. దొంగతనం చేయడంలో కూడా ఎంతో నేర్పు, మరెంతో నైపుణ్యం ఉండాలి. లేదంటే కటకటాల పాలవడం ఖాయం. తనకు ఆ కళలో బోల్డంత నైపుణ్యం ఉందని చాటిందో పనిమనిషి. పనిచేస్తున్న ఇంట్లోనే ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా బంగారు ఆభరణాలను వారి కళ్లముందే ఎత్తుకెళ్లింది. ఆభరణాలు పోతుండడం, ఇంట్లోకి వేరే వ్యక్తులెవరూ రాకపోవడంతో పనిమనిషిపైనే అనుమానం వచ్చిన యజమాని వలవేసి పట్టుకుంది. బంగారు ఆభరణాలను ఇంటి నుంచి తరలించిన వైనం విని ఆశ్చర్యపోయింది. దుబాయ్లోని జుమీరా ప్రాంతంలోని ఓ ఇంట్లో ఫిలిప్పీన్స్కు చెందిన ఓ మహిళ(29) పనిమనిషిగా చేస్తోంది. ఇటీవల ఇంట్లోని నగలు, డబ్బు మాయమవుతుండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనుమానిత వ్యక్తులెవరూ ఇంటికి రాకపోవడంతో అవి ఎలా పోతున్నదీ వారికి అర్థం కాలేదు. చివరికి పనిమనిషిపై అనుమానం వచ్చింది. దీంతో ఆమెను పరీక్షించేందుకు బెడ్రూంలో నగలు పెట్టారు. అవి కూడా మాయమవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారొచ్చి ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది. సబ్బును రెండు ముక్కలు చేసి లోపలి సబ్బును తీసేసి గుల్లగా మార్చి అందులో దొంగిలించిన నగలు పెట్టి తిరిగి రెండింటిని కలిపేస్తున్నట్టు చెప్పింది. ఆ తర్వాత ఆ సబ్బును చేత్తో పట్టుకుని యజమానుల ముందునుంచే బయటకు వెళ్లిపోయేదానిని పోలీసులకు చెప్పింది. ఆమె నైపుణ్యాన్ని విని వారు సైతం అవాక్కయ్యారు. నగలతోపాటు డబ్బులు కూడా దొంగిలించానని, మరొకరి సాయంతో వాటిని తన ఇంటికి పంపించేదానినని పేర్కొంది. ఆమె ఇచ్చిన సమాచారంతో డబ్బు పంపిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనిమనిషిని దోషిగా నిర్ధారించిన కోర్టు తుది తీర్పును ఈనెల 9కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







