విజయవాడలో రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం

- July 03, 2016 , by Maagulf
విజయవాడలో రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం

విజయవాడలో టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారు. ఆదివారం విజయవాడలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు మీడియా సమావేశాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ఆలయాల తొలగింపుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు. టీడీపీ, బీజేపీ నేతల వాగ్వాదంతో గోశాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. బీజేపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. ఆలయాలను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని సోము వీర్రాజు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com