రమదాన్ కోసం 2,385 మస్జీదులు సిద్ధం..నెలంతా ఆధ్యాత్మిక వాతావరణం..!!
- February 25, 2025
దోహా, ఖతార్: రాబోయే పవిత్ర మాసమైన రమదాన్ కోసం ఆరాధకులను స్వీకరించడానికి అవ్కాఫ్ , స్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2,385 మసీదులను సిద్ధం చేసింది. ఈ సంవత్సరం ఇఫ్తార్ విందులు అందించడానికి 24 ప్రదేశాలలో రంజాన్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 200 మసీదులు ఇ'తికాఫ్ను పాటించేందుకు నియమించారు. ఆధ్యాత్మిక నెలలో సెమినార్లు, ఉపన్యాసాలు, విద్యా పోటీలతో సహా 950 పైగా మతపరమైన కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రమదాన్ సన్నాహకాలను మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్ ఈ డాక్టర్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ ఘనేమ్ అల్ థానీ ప్రకటించారు. పవిత్ర మాసంలో విశ్వాసం, ధార్మిక వాతావరణాన్ని పెంపొందించడానికి దోహదపడే ఉద్దేశపూర్వక కార్యక్రమాల నిర్వహణకు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. పవిత్ర మాసంలో తరావీహ్, ఖియామ్ ప్రార్థనలకు ఇమామ్లు, ముఖ్యంగా ఖతారీలు అర్హత సాధించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు.
జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ ద్వారా, దాతల సహకారంతో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ అందించడానికి మంత్రిత్వ శాఖ రంజాన్ టెంట్లను నిర్వహిస్తుందని షేక్ ఖలీద్ తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో క్యూఆర్ 170 మిలియన్ల జకాత్ వసూలు చేయాలని డిపార్ట్మెంట్ భావిస్తున్నట్లు జకాత్ వ్యవహారాల శాఖ డైరెక్టర్ మల్ అల్లా అబ్దుల్రహ్మాన్ అల్ జబర్ తెలిపారు. పవిత్ర మాసంలో ఇమామ్లు, మ్యూజిన్లను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబాలకు ఆహార బుట్టలు, ఇమామ్లు, మ్యూజిన్లకు బహుమతుల బుట్ట పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







