రమదాన్ కోసం 2,385 మస్జీదులు సిద్ధం..నెలంతా ఆధ్యాత్మిక వాతావరణం..!!
- February 25, 2025
దోహా, ఖతార్: రాబోయే పవిత్ర మాసమైన రమదాన్ కోసం ఆరాధకులను స్వీకరించడానికి అవ్కాఫ్ , స్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2,385 మసీదులను సిద్ధం చేసింది. ఈ సంవత్సరం ఇఫ్తార్ విందులు అందించడానికి 24 ప్రదేశాలలో రంజాన్ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 200 మసీదులు ఇ'తికాఫ్ను పాటించేందుకు నియమించారు. ఆధ్యాత్మిక నెలలో సెమినార్లు, ఉపన్యాసాలు, విద్యా పోటీలతో సహా 950 పైగా మతపరమైన కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రమదాన్ సన్నాహకాలను మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో అవ్కాఫ్, ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్ ఈ డాక్టర్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ ఘనేమ్ అల్ థానీ ప్రకటించారు. పవిత్ర మాసంలో విశ్వాసం, ధార్మిక వాతావరణాన్ని పెంపొందించడానికి దోహదపడే ఉద్దేశపూర్వక కార్యక్రమాల నిర్వహణకు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. పవిత్ర మాసంలో తరావీహ్, ఖియామ్ ప్రార్థనలకు ఇమామ్లు, ముఖ్యంగా ఖతారీలు అర్హత సాధించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు.
జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ ద్వారా, దాతల సహకారంతో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ అందించడానికి మంత్రిత్వ శాఖ రంజాన్ టెంట్లను నిర్వహిస్తుందని షేక్ ఖలీద్ తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో క్యూఆర్ 170 మిలియన్ల జకాత్ వసూలు చేయాలని డిపార్ట్మెంట్ భావిస్తున్నట్లు జకాత్ వ్యవహారాల శాఖ డైరెక్టర్ మల్ అల్లా అబ్దుల్రహ్మాన్ అల్ జబర్ తెలిపారు. పవిత్ర మాసంలో ఇమామ్లు, మ్యూజిన్లను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబాలకు ఆహార బుట్టలు, ఇమామ్లు, మ్యూజిన్లకు బహుమతుల బుట్ట పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







