తప్పిపోయిన 9 రోజుల తర్వాత గుర్తింపు.. కుటుంబం చెంతకు ప్రవాసుడు..!!
- February 25, 2025
యూఏఈ: ఫిబ్రవరి 15 సాయంత్రం అజ్మాన్లోని తన ఇంటి నుండి తప్పిపోయిన తొమ్మిది రోజుల తర్వాత 24 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసుడిని దుబాయ్లో గుర్తించారు. ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల సమయంలో సౌద్ని గుర్తించిన అజ్మాన్ పోలీసులు అతని ఆచూకీ గురించి యువకుడి కుటుంబానికి తెలియజేసి సురక్షితంగా అతడి కుటుంబానికి అప్పగించారు. అతడిని గుర్తించడంలో సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న నివాసితులు కలిసి వచ్చారు. తప్పిపోయిన బాలుడు దుబాయ్లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ సమీపంలో గుర్తించినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ప్రజలు చేసిన సహాయానికి అతడి తల్లి ధన్యవాదాలు తెలియజేసింది. తన భర్త ఏడేళ్ల క్రితం బంగ్లాదేశ్కు వెళ్లినప్పటి నుండి ఒంటరిగా ఆరుగురి పిల్లలతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థికంగా కష్టపడుతున్నట్టు తెలిపారు.
మెడికల్ నివేదికల ప్రకారం.. తప్పిపోయిన యువకుడు పారానోయిడ్ స్కిజోఫ్రెనియా జబ్బుతో బాధపడుతున్నాడు. అతను అల్ అవీర్లోని అమల్ సైకియాట్రిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







