తప్పిపోయిన 9 రోజుల తర్వాత గుర్తింపు.. కుటుంబం చెంతకు ప్రవాసుడు..!!
- February 25, 2025
యూఏఈ: ఫిబ్రవరి 15 సాయంత్రం అజ్మాన్లోని తన ఇంటి నుండి తప్పిపోయిన తొమ్మిది రోజుల తర్వాత 24 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసుడిని దుబాయ్లో గుర్తించారు. ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల సమయంలో సౌద్ని గుర్తించిన అజ్మాన్ పోలీసులు అతని ఆచూకీ గురించి యువకుడి కుటుంబానికి తెలియజేసి సురక్షితంగా అతడి కుటుంబానికి అప్పగించారు. అతడిని గుర్తించడంలో సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న నివాసితులు కలిసి వచ్చారు. తప్పిపోయిన బాలుడు దుబాయ్లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ సమీపంలో గుర్తించినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ప్రజలు చేసిన సహాయానికి అతడి తల్లి ధన్యవాదాలు తెలియజేసింది. తన భర్త ఏడేళ్ల క్రితం బంగ్లాదేశ్కు వెళ్లినప్పటి నుండి ఒంటరిగా ఆరుగురి పిల్లలతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థికంగా కష్టపడుతున్నట్టు తెలిపారు.
మెడికల్ నివేదికల ప్రకారం.. తప్పిపోయిన యువకుడు పారానోయిడ్ స్కిజోఫ్రెనియా జబ్బుతో బాధపడుతున్నాడు. అతను అల్ అవీర్లోని అమల్ సైకియాట్రిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









