తప్పిపోయిన 9 రోజుల తర్వాత గుర్తింపు.. కుటుంబం చెంతకు ప్రవాసుడు..!!
- February 25, 2025
యూఏఈ: ఫిబ్రవరి 15 సాయంత్రం అజ్మాన్లోని తన ఇంటి నుండి తప్పిపోయిన తొమ్మిది రోజుల తర్వాత 24 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసుడిని దుబాయ్లో గుర్తించారు. ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల సమయంలో సౌద్ని గుర్తించిన అజ్మాన్ పోలీసులు అతని ఆచూకీ గురించి యువకుడి కుటుంబానికి తెలియజేసి సురక్షితంగా అతడి కుటుంబానికి అప్పగించారు. అతడిని గుర్తించడంలో సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న నివాసితులు కలిసి వచ్చారు. తప్పిపోయిన బాలుడు దుబాయ్లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ సమీపంలో గుర్తించినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ప్రజలు చేసిన సహాయానికి అతడి తల్లి ధన్యవాదాలు తెలియజేసింది. తన భర్త ఏడేళ్ల క్రితం బంగ్లాదేశ్కు వెళ్లినప్పటి నుండి ఒంటరిగా ఆరుగురి పిల్లలతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థికంగా కష్టపడుతున్నట్టు తెలిపారు.
మెడికల్ నివేదికల ప్రకారం.. తప్పిపోయిన యువకుడు పారానోయిడ్ స్కిజోఫ్రెనియా జబ్బుతో బాధపడుతున్నాడు. అతను అల్ అవీర్లోని అమల్ సైకియాట్రిక్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







